కాజల్ తల్లి కాబోతోందట, కమిటైన సినిమాల నుంచి తప్పుకుందట అంటూ కొద్ది రోజులుగా వార్తల మీద వార్తలు వస్తున్నాయి. కానీ దాన్ని ఇంతవరకు ఎవరూ కన్ఫర్మ్ చేసింది లేదు. అయితే రీసెంట్గా ఆమె చేయాల్సిన సినిమా హన్సిక చేస్తున్నట్లు తెలియడంతో ఆ న్యూస్ నిజమై ఉండొచ్చనే అనిపిస్తోంది.
ప్రస్తుతం కాజల్ చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిలో ఆచార్య, హే సినామికా, ఉమ లాంటి కొన్ని చిత్రాలు కంప్లీట్ చేసేసింది. మిగతావన్నీ సెట్స్పై ఉన్నాయి. కాంట్రవర్శీలతో ఆగిన ‘ఇండియన్ 2’ కూడా త్వరలో రీస్టార్ట్ కానుందని కమల్ హాసన్ చెప్పారు. ఒకవేళ కాజల్ కన్సీవ్ అవ్వడం నిజమే అయితే వీటిని పూర్తి చేయడం ఇప్పట్లో జరిగే పని కాదు. ముఖ్యంగా నాగార్జునతో చేస్తున్న ‘ద ఘోస్ట్’ మూవీ చేయడం ఆమెకి మరీ కష్టం.
ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్. నాగ్తో పాటు కాజల్ కూడా చాలా పవర్ఫుల్ రోల్ చేస్తోంది. ఫైట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి తను తల్లి కాబోతుంటే ఈ రోల్ చేయడం కాస్త కష్టం, రిస్క్ కూడా. అందుకే కాజల్ ఆ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలొచ్చాయి. మరోవైపు ఆమె చేయాల్సిన ‘రౌడీ బేబీ’ సినిమా రీసెంట్గా హన్సికతో మొదలైంది. కాజల్ తమ ‘రౌడీ బేబీ’ మూవీలో లీడ్ రోల్ చేస్తోందంటూ జులై నెలలో నిర్మాత పిళ్లై అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్గా జరిగిన ఓపెనింగ్ సమయంలో కాజల్ బదులు హన్సిక చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
ఇవన్నీ చూస్తుంటే ఇంతవరకు వచ్చిన వార్తలన్నీ నిజమేననిపిస్తోంది. తాజాగా కాజల్ చేసిన ఓ ప్రకటన దీనికి మరింత బలాన్నిస్తోంది. ‘ఓ కొత్త అనౌన్స్మెంట్ రాబోతోంది, కాస్త వేచి ఉండండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కాజల్. దాంతో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫర్మ్ చేయబోతోందంటున్నారంతా. అది నిజమో లేక మరేదైనా కొత్త కబురు చెప్పబోతోందో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 8, 2021 9:43 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…