Movie News

రకుల్ ఇంటికి క్రిష్ వెళ్లినప్పుడు ఏం జరిగింది?

సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను బయటపెట్టడం చాలా అరుదు. అలాంటి ఆసక్తికర విషయాల్ని అప్పుడప్పుడు బయటకు వెల్లడిస్తుంటారు కొందరు నటీనటులు. తాజాగా అలాంటి ఉదంతాన్నే వెల్లడించారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఆమె క్రిష్ దర్శకత్వంలో నటించిన ‘కొండ పొలం’ మూవీ ఈ వారం విడుదల కానుంది. ఈ సినిమాలో గొర్రెలు కాసే అమ్మాయిగా రకుల్ కనిపించనుంది.

ఈ సినిమా కథ చెప్పేందుకు తన ఇంటికి దర్శకుడు క్రిష్ వచ్చినప్పుడు తాను షార్ట్.. టీషర్ట్ లో ఉన్నట్లు చెప్పారు. తనను చూసినంతనే ‘యంగ్ గా ఉన్నావ్.. వైష్ణవ్ తేజ్ పక్కన యంగ్ గర్ల్ కావాలనుకున్నా.. అలాగే ఉన్నావ్’ అంటూ క్రిష్ కాంప్లిమెంట్ ఇచ్చినట్లుగా రకుల్ చెప్పింది. తాను ఇంకా యంగ్ అనే మెసేజ్ ను చాలా తెలివిగా పరిశ్రమకు చెప్పడానికి ముప్ఫై ఏళ్ల రకుల్ చేసిన ప్రయత్నం బాగుంది.

ఇప్పటికే పలువురు సీనియర్ హీరోలతో నటించిన ఆమె.. తాను యంగ్ హీరోలతో చేయడానికి సరిగ్గా సూట్ అవుతానన్న విషయాన్ని మంచి టైమింగ్ తో చెప్పింది. తనకెంత క్లిష్టమైన టాస్కు ఇచ్చినా.. చేసేస్తానని చెబుతోంది. ఈ సందర్భంగా కొండపొలం ఎదురైన ఓ ఆసక్తికరమైన ఘటనను వివరించింది.

ఈ సినిమాలో రకుల్ ది గొర్రెలు కాసే అమ్మాయి పాత్ర అని తెలిసిందే. మరి ఆ పాత్ర అంత సులువు కాదు కదా. గొర్రెల్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఆ క్రమంలో షూటింగ్ లో గొర్రెల్ని కంట్రోల్ చేయటం కష్టమైందని చెప్పుకొచ్చారు. కానీ తాను.. వైష్ణవ్ తేజ్ కలిసి నాలుగు రోజులకే గొర్రెల్ని కంట్రోల్ చేయటం నేర్చుకున్నట్లు చెప్పింది.

మొత్తానికి రోటీన్ సినిమాలకు భిన్నంగా కొండపొలం సినిమాలో రకుల్ ఎక్కువగా కష్టపడిందన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి. మరి..ఆ కష్టం ఎంతో తెర మీద కనిపించనుంది.

This post was last modified on October 7, 2021 11:31 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

2 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

2 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

3 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

3 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

3 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

3 hours ago