సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను బయటపెట్టడం చాలా అరుదు. అలాంటి ఆసక్తికర విషయాల్ని అప్పుడప్పుడు బయటకు వెల్లడిస్తుంటారు కొందరు నటీనటులు. తాజాగా అలాంటి ఉదంతాన్నే వెల్లడించారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఆమె క్రిష్ దర్శకత్వంలో నటించిన ‘కొండ పొలం’ మూవీ ఈ వారం విడుదల కానుంది. ఈ సినిమాలో గొర్రెలు కాసే అమ్మాయిగా రకుల్ కనిపించనుంది.
ఈ సినిమా కథ చెప్పేందుకు తన ఇంటికి దర్శకుడు క్రిష్ వచ్చినప్పుడు తాను షార్ట్.. టీషర్ట్ లో ఉన్నట్లు చెప్పారు. తనను చూసినంతనే ‘యంగ్ గా ఉన్నావ్.. వైష్ణవ్ తేజ్ పక్కన యంగ్ గర్ల్ కావాలనుకున్నా.. అలాగే ఉన్నావ్’ అంటూ క్రిష్ కాంప్లిమెంట్ ఇచ్చినట్లుగా రకుల్ చెప్పింది. తాను ఇంకా యంగ్ అనే మెసేజ్ ను చాలా తెలివిగా పరిశ్రమకు చెప్పడానికి ముప్ఫై ఏళ్ల రకుల్ చేసిన ప్రయత్నం బాగుంది.
ఇప్పటికే పలువురు సీనియర్ హీరోలతో నటించిన ఆమె.. తాను యంగ్ హీరోలతో చేయడానికి సరిగ్గా సూట్ అవుతానన్న విషయాన్ని మంచి టైమింగ్ తో చెప్పింది. తనకెంత క్లిష్టమైన టాస్కు ఇచ్చినా.. చేసేస్తానని చెబుతోంది. ఈ సందర్భంగా కొండపొలం ఎదురైన ఓ ఆసక్తికరమైన ఘటనను వివరించింది.
ఈ సినిమాలో రకుల్ ది గొర్రెలు కాసే అమ్మాయి పాత్ర అని తెలిసిందే. మరి ఆ పాత్ర అంత సులువు కాదు కదా. గొర్రెల్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఆ క్రమంలో షూటింగ్ లో గొర్రెల్ని కంట్రోల్ చేయటం కష్టమైందని చెప్పుకొచ్చారు. కానీ తాను.. వైష్ణవ్ తేజ్ కలిసి నాలుగు రోజులకే గొర్రెల్ని కంట్రోల్ చేయటం నేర్చుకున్నట్లు చెప్పింది.
మొత్తానికి రోటీన్ సినిమాలకు భిన్నంగా కొండపొలం సినిమాలో రకుల్ ఎక్కువగా కష్టపడిందన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి. మరి..ఆ కష్టం ఎంతో తెర మీద కనిపించనుంది.
This post was last modified on October 7, 2021 11:31 am
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…