ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్నీ వేధిస్తున్న ప్రశ్న.. అసలు సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనే. కొందరు సన్నిహితులు తమకు తెలిసిన కారణాలు చెబుతున్నారు. మరికొందరు తెలుసుకునే చాన్స్ లేక తమకు తెలిసిందే మాట్లాడేస్తున్నారు. దాంతో ఈ విషయంపై కాస్త ఎక్కువే రభసే అవుతోంది. తమకు ప్రైవసీ ఇవ్వమని నాగ్, సామ్ విడాకుల్ని ప్రకటించినప్పుడే కోరారు. అది వారి వ్యక్తిగతం అని నాగార్జున కూడా అన్నారు. అయినా కూడా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉండటంతో చివరికి చైతు మేనమామ వెంకటేష్ కూడా రియాక్టయ్యారు.
రీసెంట్గా వెంకీ ఇన్స్ట్రాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘నోరు తెరవడానికి ముందు మనసు తెరవండి’ అని ఉంది. మనసు అనేది ఆలోచనల పుట్ట అని, మనం వెళ్లే మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలని కూడా వెంకీ మరో పోస్ట్లో అన్నారు. ఆయన పోస్టులు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
ఇవి కచ్చితంగా చైతు, సమంతల గురించేనని అందరికీ అర్థమయ్యింది. ఏది పడితే అది మాట్లాడేయకుండా, అర్థం లేని కథలు పుట్టించకుండా వాళ్ల మానాన వాళ్లని వదిలేయమని ఒక్క మాటలో భలే చెప్పారంటున్నారు నెటిజన్స్.
నిజమే. చైతు, సమంతలు ఎందుకు విడిపోయారనేది వారి వ్యక్తిగతం. దాని ఫలితం ఏదైనా వాళ్లే భరించాలి, భరిస్తారు. అది మర్చిపోయి ఎవరెవరో మధ్యలో దూరిపోవడం, జడ్జిమెంట్ ఇచ్చేయడం సమంజసం కాదు. ఆ విషయాన్ని మర్చిపోవడం వల్లే ఏ విషయంలోనూ కల్పించుకోని వెంకీ కూడా ఇలా ఘాటుగా రియాక్టయ్యారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on October 6, 2021 6:07 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…