నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయగా.. ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించబోతుందని సమాచారం. అయితే అది సినిమా కాదు.. టాక్ షో అని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’.. బాలయ్య హోస్ట్ గా ఓ టాక్ షో ప్లాన్ చేస్తుంది. నిజానికి బాలయ్య ఇప్పటివరకు హోస్ట్ గా ఎప్పుడూ వ్యవహరించలేదు.
కానీ ‘ఆహా’ కోసం ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ షో ద్వారా వచ్చే డబ్బుని ఛారిటీ కోసం ఖర్చు చేయాలని బాలయ్య భావిస్తున్నారట. ఈ టాక్ షోకి ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో టాక్ షోలను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ ఇలా.. సినిమా ఫార్మాట్ లోనే సాగుతుంది. నిజానికి బాలీవుడ్ లో ఇంత హడావిడి ఉంటుంది కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు.
గతంలో ‘ఆహా’లో వచ్చి ఓ టాక్ షోకి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. బాలయ్యతో అనుబంధం ఉన్న దర్శకుడైతే షోని సక్సెస్ ఫుల్ గా నిర్వహించగలరని ‘ఆహా’ భావించింది. అందుకే ఆ బాధ్యతను క్రిష్ కి అప్పగించింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ రూపొందించిన ‘కొండపొలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
This post was last modified on October 6, 2021 2:27 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన నాయకుల కోరికలకు కూటమి పెద్ద టీడీపీ గ్రీన్సిగ్నల్…
స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. మాస్ మహారాజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజుని హీరోగా పరిచయం చేస్తూ…
‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’తో ఆదిత్య హాసన్ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. చిన్న చిన్న కుటుంబ…
ఇప్పటిదాకా తెలుగు తెరమీద వందలాది నక్సల్స్ సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో సాగేవే. ఎర్ర…
నాని కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 లేదా…
పాపం గీత - పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. రాజకీయంగా ఆమె ఇక్కడ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత…