నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయగా.. ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించబోతుందని సమాచారం. అయితే అది సినిమా కాదు.. టాక్ షో అని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’.. బాలయ్య హోస్ట్ గా ఓ టాక్ షో ప్లాన్ చేస్తుంది. నిజానికి బాలయ్య ఇప్పటివరకు హోస్ట్ గా ఎప్పుడూ వ్యవహరించలేదు.
కానీ ‘ఆహా’ కోసం ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ షో ద్వారా వచ్చే డబ్బుని ఛారిటీ కోసం ఖర్చు చేయాలని బాలయ్య భావిస్తున్నారట. ఈ టాక్ షోకి ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో టాక్ షోలను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ ఇలా.. సినిమా ఫార్మాట్ లోనే సాగుతుంది. నిజానికి బాలీవుడ్ లో ఇంత హడావిడి ఉంటుంది కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు.
గతంలో ‘ఆహా’లో వచ్చి ఓ టాక్ షోకి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. బాలయ్యతో అనుబంధం ఉన్న దర్శకుడైతే షోని సక్సెస్ ఫుల్ గా నిర్వహించగలరని ‘ఆహా’ భావించింది. అందుకే ఆ బాధ్యతను క్రిష్ కి అప్పగించింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ రూపొందించిన ‘కొండపొలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
This post was last modified on October 6, 2021 2:27 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…