నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయగా.. ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించబోతుందని సమాచారం. అయితే అది సినిమా కాదు.. టాక్ షో అని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’.. బాలయ్య హోస్ట్ గా ఓ టాక్ షో ప్లాన్ చేస్తుంది. నిజానికి బాలయ్య ఇప్పటివరకు హోస్ట్ గా ఎప్పుడూ వ్యవహరించలేదు.
కానీ ‘ఆహా’ కోసం ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ షో ద్వారా వచ్చే డబ్బుని ఛారిటీ కోసం ఖర్చు చేయాలని బాలయ్య భావిస్తున్నారట. ఈ టాక్ షోకి ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో టాక్ షోలను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ ఇలా.. సినిమా ఫార్మాట్ లోనే సాగుతుంది. నిజానికి బాలీవుడ్ లో ఇంత హడావిడి ఉంటుంది కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు.
గతంలో ‘ఆహా’లో వచ్చి ఓ టాక్ షోకి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. బాలయ్యతో అనుబంధం ఉన్న దర్శకుడైతే షోని సక్సెస్ ఫుల్ గా నిర్వహించగలరని ‘ఆహా’ భావించింది. అందుకే ఆ బాధ్యతను క్రిష్ కి అప్పగించింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ రూపొందించిన ‘కొండపొలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…