అల్లు అర్జున్-సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అందులో ఫస్ట్ పార్ట్ అయిన పుష్ప-ది రైజ్ను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. క్రిస్మస్కు వారం ముందే, అంటే డిసెంబరు 17న పుష్ప-1 వస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కానీ దీని గురించి హీరో అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ వేయలేదు.
మామూలుగా తన సినిమాలకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా బన్నీ ట్వీట్ రూపంలో అభిమానులతో పంచుకుంటాడు. కానీ పుష్ప రిలీజ్ డేట్ గురించి మాత్రం అతను ట్వీట్ వేయలేదు. ఇది యధాలాపంగా విస్మరించిన విషయం కాదని.. విడుదల తేదీ విషయంలో బన్నీ డోలాయమానంలో ఉన్నాడే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డేట్ ఫైనల్ కాదేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
ఇందుకు కారణం లేకపోలేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యను కూడా క్రిస్మస్ బరిలో దించాలని చూస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే డిసెంబరు 17కే ఈ సినిమాను ఖరారు చేసినట్లుగా కూడా సోషల్ మీడియాలో వార్తలొస్తుండటం విశేషం.
దసరాకు కానీ.. దీపావళికి కానీ ఆచార్యను రెడీ చేయలేకపోగా.. సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోయాయి. వేసవి వరకు సినిమాను ఆపే పరిస్థితి లేదు. దీంతో క్రిస్మస్ టైంలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నట్లుగా చిత్ర బృందం నుంచి సమాచారం బయటికొస్తోంది. కానీ పుష్ప కూడా అదే సీజన్కు రెడీ అవుతుండటంతో రిలీజ్ డేట్ విషయంలో ఏం చేద్దామనే సందిగ్ధత నెలకొంది. మరి ఈ రెండు చిత్రాల మేకర్స్ మధ్య రిలీజ్ డేట్ విషయంలో ఏం సర్దుబాటు జరుగుతుందో.. ఏది ఏ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
This post was last modified on October 5, 2021 12:42 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…