Movie News

ప్రభాస్ 25వ సినిమా అప్డేట్ ఇదే!

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ఇప్పుడు తన 25వ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న ప్రభాస్.. తన 21వ సినిమాగా ‘ఆదిపురుష్’ని మొదలుపెట్టారు. 22వ సినిమాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్నారు. 23వ సినిమా ‘ప్రాజెక్ట్ K’ కాగా.. 24వ సినిమా సిద్ధార్థ్ ఆనంద్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ 25వ సినిమా గురించి ప్రకటన రానుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది.

అక్టోబర్ 7న ఈ ప్రకటన రానుందని సమాచారం. ఇంతకీ ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే.. సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాను అందించిన ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. నిజానికి గతంలో ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు. బాలీవుడ్ సంస్థ టి సిరీస్ ఈ సినిమాను నిర్మించబోతోంది.

ఈ సంస్థతో పాటు మరో సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోనుంది. మైత్రి మూవీ మేకర్స్ లేదా యూవీ క్రియేషన్స్ లో ఏదొక బ్యానర్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుందని అంటున్నారు. దిల్ రాజుకి కూడా ప్రభాస్ ఓ సినిమా చేయాలి. మరి ఆయన ఏ బ్యానర్ ను ఇన్వాల్వ్ చేస్తారో చూడాలి. వరుస సినిమాలు ప్రకటిస్తూ.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తూ చాలా బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాను జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

This post was last modified on October 4, 2021 9:36 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

2 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

3 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

4 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

4 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

5 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

7 hours ago