పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ఇప్పుడు తన 25వ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న ప్రభాస్.. తన 21వ సినిమాగా ‘ఆదిపురుష్’ని మొదలుపెట్టారు. 22వ సినిమాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్నారు. 23వ సినిమా ‘ప్రాజెక్ట్ K’ కాగా.. 24వ సినిమా సిద్ధార్థ్ ఆనంద్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ 25వ సినిమా గురించి ప్రకటన రానుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది.
అక్టోబర్ 7న ఈ ప్రకటన రానుందని సమాచారం. ఇంతకీ ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే.. సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాను అందించిన ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. నిజానికి గతంలో ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు. బాలీవుడ్ సంస్థ టి సిరీస్ ఈ సినిమాను నిర్మించబోతోంది.
ఈ సంస్థతో పాటు మరో సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోనుంది. మైత్రి మూవీ మేకర్స్ లేదా యూవీ క్రియేషన్స్ లో ఏదొక బ్యానర్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుందని అంటున్నారు. దిల్ రాజుకి కూడా ప్రభాస్ ఓ సినిమా చేయాలి. మరి ఆయన ఏ బ్యానర్ ను ఇన్వాల్వ్ చేస్తారో చూడాలి. వరుస సినిమాలు ప్రకటిస్తూ.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తూ చాలా బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాను జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on October 4, 2021 9:36 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…