నవరస.. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా రెండు నెలల కిందట చర్చనీయాంశంగా మారిన ఆంథాలజీ ఫిలిం. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన చిత్రమిది. దర్శకుడు, యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర కూడా ఇందులో భాగస్వామి. ఇందులో తొమ్మిది కథలుంటే.. వాటిని ప్రియదర్శన్, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు సహా తొమ్మిది మంది రూపొందించడం విశేషం. సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి లాంటి మేటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఐతే ఇంతమంది లెజెండ్స్, ప్రముఖులు కలిసి చేసిన ఆంథాలజీ ఫిలిం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. అయినప్పటికీ ఇంతమంది పేరున్న ఫిలిం మేకర్స్, ఆర్టిస్టులు కలిసి చేసిన ఫిలిం కాబట్టి దీన్ని జనం బాగానే చూశారు. నెట్ ఫ్లిక్స్ నుంచి దీని మేకర్స్ ఆదాయం బాగానే వచ్చింది.
ఐతే ఇదేమీ సొంతంగా లాభాలు చేసుకోవడానికి చేసిన సినిమా కాదు. కరోనా కాలంలో అవస్థలు పడ్డ సినీ కార్మికులను ఆదుకోవడం కోసమే తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా కలిసి ఉచితంగా ఈ ఫిలిం చేశారు. ఎవ్వరూ పారితోషకాలు తీసుకోలేదు. దీని ద్వారా ఎంత ఆదాయం వచ్చిందన్నది వెల్లడి కాలేదు కానీ.. ఈ డబ్బులతో సినీ కార్మికులు, వారి కుటుంబాలకు చెందిన వారు కలిపి మొత్తం 12 వేల మందికి సాయం చేశారట. ఇంతమంది కడుపులు నింపిన సిరీస్ అంటూ దీనిపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.
కరోనా టైంలో వివిధ సినీ పరిశ్రమలు అందులోని కార్మికులను ఆదుకోవడానికి వివిధ రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. అన్ని ఇండస్ట్రీల్లోకి టాలీవుడ్ గొప్పగా స్సందించింది. చిరంజీవి సహా ప్రముఖులందరూ పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. బయట కూడా నిధులు సేకరించి కార్మికుల కడుపు నింపారు. తమిళ సినీ పరిశ్రమ నుంచి ఆ స్థాయిలో విరాళాలు రాలేదు కానీ.. వాళ్లు కూడా ఉన్నంతలో సేవా కార్యక్రమాలు బాగానే చేశారు. వాటికి తోడు ‘నవరస’ ఫిలిం ద్వారా కార్మికులకు సాయం అందింది.
This post was last modified on October 4, 2021 10:44 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…