నవరస.. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా రెండు నెలల కిందట చర్చనీయాంశంగా మారిన ఆంథాలజీ ఫిలిం. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన చిత్రమిది. దర్శకుడు, యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర కూడా ఇందులో భాగస్వామి. ఇందులో తొమ్మిది కథలుంటే.. వాటిని ప్రియదర్శన్, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు సహా తొమ్మిది మంది రూపొందించడం విశేషం. సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి లాంటి మేటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఐతే ఇంతమంది లెజెండ్స్, ప్రముఖులు కలిసి చేసిన ఆంథాలజీ ఫిలిం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. అయినప్పటికీ ఇంతమంది పేరున్న ఫిలిం మేకర్స్, ఆర్టిస్టులు కలిసి చేసిన ఫిలిం కాబట్టి దీన్ని జనం బాగానే చూశారు. నెట్ ఫ్లిక్స్ నుంచి దీని మేకర్స్ ఆదాయం బాగానే వచ్చింది.
ఐతే ఇదేమీ సొంతంగా లాభాలు చేసుకోవడానికి చేసిన సినిమా కాదు. కరోనా కాలంలో అవస్థలు పడ్డ సినీ కార్మికులను ఆదుకోవడం కోసమే తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా కలిసి ఉచితంగా ఈ ఫిలిం చేశారు. ఎవ్వరూ పారితోషకాలు తీసుకోలేదు. దీని ద్వారా ఎంత ఆదాయం వచ్చిందన్నది వెల్లడి కాలేదు కానీ.. ఈ డబ్బులతో సినీ కార్మికులు, వారి కుటుంబాలకు చెందిన వారు కలిపి మొత్తం 12 వేల మందికి సాయం చేశారట. ఇంతమంది కడుపులు నింపిన సిరీస్ అంటూ దీనిపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.
కరోనా టైంలో వివిధ సినీ పరిశ్రమలు అందులోని కార్మికులను ఆదుకోవడానికి వివిధ రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. అన్ని ఇండస్ట్రీల్లోకి టాలీవుడ్ గొప్పగా స్సందించింది. చిరంజీవి సహా ప్రముఖులందరూ పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. బయట కూడా నిధులు సేకరించి కార్మికుల కడుపు నింపారు. తమిళ సినీ పరిశ్రమ నుంచి ఆ స్థాయిలో విరాళాలు రాలేదు కానీ.. వాళ్లు కూడా ఉన్నంతలో సేవా కార్యక్రమాలు బాగానే చేశారు. వాటికి తోడు ‘నవరస’ ఫిలిం ద్వారా కార్మికులకు సాయం అందింది.
This post was last modified on October 4, 2021 10:44 am
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…