వేణు స్వామి.. తెలుగు జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకం గురించి అంచనాలు కడుతూ సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ సంపాదించారాయన. ఆయన అంచనాలు కొన్ని నిజమయ్యాయి. కొన్ని బోల్తా కొట్టాయి. ఐతే సంచలన విషయాల మీద చాలా కాన్ఫిడెంట్గా జ్యోతిషం చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారాయన. అక్కినేని కుటుంబంలో రెండు పెళ్ళిళ్ళ గురించి ఆయన వేసిన అంచనాలు నిజం కావడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో శ్రియ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం చేసుకోవడం తెలిసిందే. ఐతే ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్లిద్దరూ విడిపోవడం సంచలనం రేపింది. దీని గురించి వేణు స్వామి ముందే అంచనా వేశారు. జాతకాల ప్రకారం వాళ్లిద్దరూ విడిపోతారని చెప్పారు. ఇక నాగచైతన్య-సమంతల విషయంలోనూ వేణు స్వామి ఇలాగే అంచనా వేయడం విశేషం.
గతంలో ఫేస్ బుక్ వేదికగా నాగచైతన్య, సమంత జంట గురించి ఒక పోస్టు పెట్టారు వేణు స్వామి. చైతూది ఆశ్లేష నక్షత్రమని, సమంతది భరణి నక్షత్రమని.. వీళ్లిద్దరికి సరిపడదని.. అందుకే పెళ్లి ఒకసారి పోస్ట్ పోన్ అయిందని.. పెళ్లి తర్వాత కూడా కుజ దోషం, కాలసర్ప దోషం వల్ల విడాకులు తప్పవని, లేదంటే సంతాన లేకపోవడం జరుగుతుందని ఆయనొక పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాక ‘లవ్ స్టోరి’ విడుదలకు కొన్ని రోజుల ముందు వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో చైతూ-సామ్ జంట గురించి మాట్లాడారు.
వీళ్లిద్దరూ విడిపోయే అవకాశం ఉందని.. ఒకవేళ అదే జరిగితే నాగచైతన్య కెరీర్లో తిరుగులేని స్థాయికి వెళ్తాడని.. సమంత కంటే 100 రెట్లు ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తాడని.. అదే సమయంలో సమంత బాగా డౌన్ అయిపోతుందని.. చైతూ ఎదుగుదలకు ‘లవ్ స్టోరి’ ప్రారంభంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వీడియో కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆయన్ని సరదాగానే విజనరీగా అభివర్ణించేస్తున్నారు నెటిజన్లుజ వేణు స్వామి గతంలో వేసిన అంచనాల్లో కొన్ని ఇలాగే నిజమైనప్పటికీ.. చాలా వరకు తలకిందులయ్యాయి. అఖిల్-శ్రియ, చైతూ-సామ్ల విషయంలో ఆయన వైల్డ్ గెస్లు నిజమైనంత మాత్రాన వేణు స్వామిని పొగిడేయాల్సిన అవసరం లేదని ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు.
This post was last modified on October 3, 2021 3:07 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…