వెన్నెల సినిమాతో డెబ్యూలోనే మంచి హిట్ కొట్టి.. ఆ తర్వాత ప్రస్థానం లాంటి గొప్ప సినిమాతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన దర్శకుడు దేవా కట్టా. ఆ సినిమాతో ఒక్కసారిగా తనపై అంచనాలు పెంచేసిన దేవా.. ఆ తర్వాత తీసిన సినిమాలతో అంచనాలను అందుకోలేకపోయాడు.
ఆటోనగర్ సూర్య, డైనమైట్, హిందీ ప్రస్థానం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈ స్థితిలో దేవా ఆశలన్నీ రిపబ్లిక్ మీదే నిలిచాయి. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో దేవా తీసిన సినిమా ఇది. వరుసగా మూడు డిజాస్టర్లు, పైగా చాలా ఏళ్ల విరామం తర్వాత సాయిధరమ్ తేజ్ లాంటి హీరో దొరకడం.. మంచి బడ్జెట్ పెట్టే నిర్మాతలు లభించడం దేవా అదృష్టమే.
తన నుంచి అందరూ ప్రస్థానం లాంటి సినిమాను ఆశిస్తున్న నేపథ్యంలో సమకాలీన రాజకీయాలపై ఒక సీరియస్ సినిమా తీశాడు దేవా. కానీ సినిమాలో పెద్దగా కమర్షియల్ హంగులు లేకపోవడం, స్లో నరేషన్, ట్రాజిక్ క్లైమాక్స్ లాంటి ప్రతికూలంగా మారాయి. సినిమాకు ఆశించినంత మంచి టాక్ రాలేదు. సమీక్షలూ అంతంతమాత్రమే. ఆ ప్రభావం వసూళ్ల మీదా పడింది.
ఐతే రిలీజ్ ముంగిట హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రమోషన్లకు అందుబాటులో లేకుండా పోవడం.. ప్రోమోలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకర్షించకపోవడంతో సినిమాకు అనుకున్నంత బజ్ లేదు. రిలీజ్ తర్వాత టాక్, సమీక్షలు ఆశించిన విధంగా లేవు. ఈ చిత్రాన్ని నిర్మాతలు అంతగా ప్రమోట్ చేయట్లేదు.
రిలీజ్ తర్వాత కూడా తేజు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్కు తెలుగులో అంతగా ఫాలోయింగ్ లేదు. ఆమె రిలీజ్ తర్వాత ప్రమోషన్లు చేయట్లేదు. ఈ స్థితిలో దేవా కట్టా ప్రమోషన్ల పరంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
సోషల్ మీడియాలో సినిమా గురించి పెట్టిన పాజిటివ్ కామెంట్లన్నింటినీ సేకరించి.. ట్విట్టర్లో షేర్ చేస్తున్నాడు. పాజిటివ్గా మాట్లాడిన వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతున్నాడు. పాజిటివ్ రివ్యూల లింక్స్ సైతం పంచుకుంటున్నాడు. మొత్తానికి తన కెరీర్కు చాలా కీలకమైన సినిమాను కాపాడటానికి దేవా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. మరి చివరికి రిపబ్లిక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on October 3, 2021 11:52 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…