బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు వివాదాల చుట్టూ తిరుగుతుంటుంది. నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలపై ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. సుశాంత్ సింగ్ మరణించినప్పుడు కూడా ఆమె పెట్టిన కొన్ని పోస్ట్ లు వివాదానికి దారి తీశాయి. ఇప్పుడు ఈ బ్యూటీ చైతు-సమంత విడాకులపై స్పందించిన తీరు వార్తల్లో నిలిచేలా చేసింది. తమ వివాహబంధానికి స్వస్తి చెబుతూ చైతు-సమంత సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన సంగతి తెలిసిందే.
నాగార్జున కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ విషయంపై కంగనా స్పందించింది. వీరిద్దరి విడాకుల మధ్యలోని ఆమిర్ ఖాన్ ను తీసుకొచ్చింది. చైతు-ఆమిర్ ల పేర్లు నేరుగా చెప్పకుండా.. తాజాగా విడాకులిచ్చిన ఈ సౌత్ హీరో కొన్ని రోజుల క్రితం ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని.. ఆ వెంటనే తన భార్యకు విడాకులిచ్చాడని కామెంట్ చేసింది కంగనా. సదరు బాలీవుడ్ సూపర్ స్టార్ కు విడాకుల స్పెషలిస్ట్ గా పేరుందని.. ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
పదేళ్లు రిలేషన్ లో ఉండి.. నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో.. ఈ విడాకుల స్పెషలిస్ట్ అయిన బాలీవుడ్ హీరోని కలిసి వెంటనే సదరు బాలీవుడ్ స్టార్ సలహాల మేరకు తన భార్యకు విడాకులిచ్చాడంటూ రాసుకొచ్చింది కంగనా.
విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకి వచ్చినా.. అందులో ఎక్కువ శాతం తప్పు మగాడిదే ఉంటుందని కంగనా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బట్టలు మార్చేంత సులువుగా ఆడవాళ్లను మార్చేసే మగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…