బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు వివాదాల చుట్టూ తిరుగుతుంటుంది. నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలపై ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. సుశాంత్ సింగ్ మరణించినప్పుడు కూడా ఆమె పెట్టిన కొన్ని పోస్ట్ లు వివాదానికి దారి తీశాయి. ఇప్పుడు ఈ బ్యూటీ చైతు-సమంత విడాకులపై స్పందించిన తీరు వార్తల్లో నిలిచేలా చేసింది. తమ వివాహబంధానికి స్వస్తి చెబుతూ చైతు-సమంత సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన సంగతి తెలిసిందే.
నాగార్జున కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ విషయంపై కంగనా స్పందించింది. వీరిద్దరి విడాకుల మధ్యలోని ఆమిర్ ఖాన్ ను తీసుకొచ్చింది. చైతు-ఆమిర్ ల పేర్లు నేరుగా చెప్పకుండా.. తాజాగా విడాకులిచ్చిన ఈ సౌత్ హీరో కొన్ని రోజుల క్రితం ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని.. ఆ వెంటనే తన భార్యకు విడాకులిచ్చాడని కామెంట్ చేసింది కంగనా. సదరు బాలీవుడ్ సూపర్ స్టార్ కు విడాకుల స్పెషలిస్ట్ గా పేరుందని.. ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
పదేళ్లు రిలేషన్ లో ఉండి.. నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో.. ఈ విడాకుల స్పెషలిస్ట్ అయిన బాలీవుడ్ హీరోని కలిసి వెంటనే సదరు బాలీవుడ్ స్టార్ సలహాల మేరకు తన భార్యకు విడాకులిచ్చాడంటూ రాసుకొచ్చింది కంగనా.
విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకి వచ్చినా.. అందులో ఎక్కువ శాతం తప్పు మగాడిదే ఉంటుందని కంగనా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బట్టలు మార్చేంత సులువుగా ఆడవాళ్లను మార్చేసే మగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది.
This post was last modified on October 3, 2021 8:07 am
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…
దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…