బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు వివాదాల చుట్టూ తిరుగుతుంటుంది. నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలపై ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. సుశాంత్ సింగ్ మరణించినప్పుడు కూడా ఆమె పెట్టిన కొన్ని పోస్ట్ లు వివాదానికి దారి తీశాయి. ఇప్పుడు ఈ బ్యూటీ చైతు-సమంత విడాకులపై స్పందించిన తీరు వార్తల్లో నిలిచేలా చేసింది. తమ వివాహబంధానికి స్వస్తి చెబుతూ చైతు-సమంత సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన సంగతి తెలిసిందే.
నాగార్జున కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ విషయంపై కంగనా స్పందించింది. వీరిద్దరి విడాకుల మధ్యలోని ఆమిర్ ఖాన్ ను తీసుకొచ్చింది. చైతు-ఆమిర్ ల పేర్లు నేరుగా చెప్పకుండా.. తాజాగా విడాకులిచ్చిన ఈ సౌత్ హీరో కొన్ని రోజుల క్రితం ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని.. ఆ వెంటనే తన భార్యకు విడాకులిచ్చాడని కామెంట్ చేసింది కంగనా. సదరు బాలీవుడ్ సూపర్ స్టార్ కు విడాకుల స్పెషలిస్ట్ గా పేరుందని.. ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
పదేళ్లు రిలేషన్ లో ఉండి.. నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో.. ఈ విడాకుల స్పెషలిస్ట్ అయిన బాలీవుడ్ హీరోని కలిసి వెంటనే సదరు బాలీవుడ్ స్టార్ సలహాల మేరకు తన భార్యకు విడాకులిచ్చాడంటూ రాసుకొచ్చింది కంగనా.
విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకి వచ్చినా.. అందులో ఎక్కువ శాతం తప్పు మగాడిదే ఉంటుందని కంగనా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బట్టలు మార్చేంత సులువుగా ఆడవాళ్లను మార్చేసే మగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది.
This post was last modified on October 3, 2021 8:07 am
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…