సక్సెస్ని ఫాలో అవ్వడమే సక్సెస్ మంత్రం. చిత్రసీమ నమ్మేది అదే. చేతిలో హిట్స్ ఉన్న వాళ్లతోనే పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారు హీరోలు. మహేష్బాబు అందుకు అతీతుడేమీ కాదు.
ఓరకంగా చెప్పాలంటే.. అందరి కంటే ఎక్కువగా సక్సెస్ల చుట్టూ తిరిగేది మహేష్నే. విచిత్రం ఏమిటంటే.. మహేష్ సక్సెస్ఫుల్ దర్శకుడినే కాదు, సక్సెస్ ఫుల్ టీమ్ మొత్తాన్ని తెచ్చుకుంటాడు. ‘సర్కారు వారి పాట’ టీమ్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది.
‘అల వైకుంఠపురములో’ `టీమ్ లో సగం మంది ‘సర్కారు వారి పాట’లో కనిపిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్, కళా దర్శకుడు ప్రకాష్, కెమెరామెన్ వినోద్.. వీళ్లంత ‘అల వైకుంఠపురములో’ టీమే. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఆమె కూడా ఖాయమైపోతే, దర్శకుడు – బ్యానర్ తప్ప దాదాపుగా కీలకమైన వాళ్లంతా ‘వైకుంఠపురములో’ నుంచి తెచ్చుకున్న వాళ్లే అవుతారు.
ప్రతినాయకుడిగా ఉపేంద్ర పేరు పరిశీలనలో ఉంది. ఆయన్నీ తెచ్చుకుంటే.. ఇది మొత్తం బన్నీ టీమ్ అవుతుంది. ఎలాగంటారా? ఉపేంద్ర విలన్గా ఎంటర్ అయ్యిందే బన్నీ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో కదా?
This post was last modified on June 2, 2020 9:12 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…