సక్సెస్ని ఫాలో అవ్వడమే సక్సెస్ మంత్రం. చిత్రసీమ నమ్మేది అదే. చేతిలో హిట్స్ ఉన్న వాళ్లతోనే పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారు హీరోలు. మహేష్బాబు అందుకు అతీతుడేమీ కాదు.
ఓరకంగా చెప్పాలంటే.. అందరి కంటే ఎక్కువగా సక్సెస్ల చుట్టూ తిరిగేది మహేష్నే. విచిత్రం ఏమిటంటే.. మహేష్ సక్సెస్ఫుల్ దర్శకుడినే కాదు, సక్సెస్ ఫుల్ టీమ్ మొత్తాన్ని తెచ్చుకుంటాడు. ‘సర్కారు వారి పాట’ టీమ్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది.
‘అల వైకుంఠపురములో’ `టీమ్ లో సగం మంది ‘సర్కారు వారి పాట’లో కనిపిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్, కళా దర్శకుడు ప్రకాష్, కెమెరామెన్ వినోద్.. వీళ్లంత ‘అల వైకుంఠపురములో’ టీమే. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఆమె కూడా ఖాయమైపోతే, దర్శకుడు – బ్యానర్ తప్ప దాదాపుగా కీలకమైన వాళ్లంతా ‘వైకుంఠపురములో’ నుంచి తెచ్చుకున్న వాళ్లే అవుతారు.
ప్రతినాయకుడిగా ఉపేంద్ర పేరు పరిశీలనలో ఉంది. ఆయన్నీ తెచ్చుకుంటే.. ఇది మొత్తం బన్నీ టీమ్ అవుతుంది. ఎలాగంటారా? ఉపేంద్ర విలన్గా ఎంటర్ అయ్యిందే బన్నీ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో కదా?
This post was last modified on June 2, 2020 9:12 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…