Movie News

బ‌న్నీ ని ఫాలో అవుతున్న మహేష్

స‌క్సెస్‌ని ఫాలో అవ్వ‌డమే స‌క్సెస్ మంత్రం. చిత్ర‌సీమ న‌మ్మేది అదే. చేతిలో హిట్స్ ఉన్న వాళ్ల‌తోనే ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపిస్తారు హీరోలు. మ‌హేష్‌బాబు అందుకు అతీతుడేమీ కాదు.

ఓర‌కంగా చెప్పాలంటే.. అంద‌రి కంటే ఎక్కువ‌గా స‌క్సెస్‌ల చుట్టూ తిరిగేది మ‌హేష్‌నే. విచిత్రం ఏమిటంటే.. మ‌హేష్ స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడినే కాదు, స‌క్సెస్ ఫుల్ టీమ్ మొత్తాన్ని తెచ్చుకుంటాడు. ‘స‌ర్కారు వారి పాట‌’ టీమ్ చూస్తే ఆ విష‌యం అర్థ‌మైపోతుంది.

‘అల వైకుంఠ‌పుర‌ములో’ `టీమ్ లో స‌గం మంది ‘స‌ర్కారు వారి పాట‌’లో క‌నిపిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌, క‌ళా ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్‌, కెమెరామెన్ వినోద్‌.. వీళ్లంత ‘అల వైకుంఠ‌పుర‌ములో’ టీమే. ఈ సినిమాలో క‌థానాయిక‌గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఆమె కూడా ఖాయ‌మైపోతే, ద‌ర్శ‌కుడు – బ్యాన‌ర్ త‌ప్ప దాదాపుగా కీల‌క‌మైన వాళ్లంతా ‘వైకుంఠ‌పుర‌ములో’ నుంచి తెచ్చుకున్న వాళ్లే అవుతారు.

ప్ర‌తినాయ‌కుడిగా ఉపేంద్ర పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఆయ‌న్నీ తెచ్చుకుంటే.. ఇది మొత్తం బ‌న్నీ టీమ్ అవుతుంది. ఎలాగంటారా? ఉపేంద్ర విల‌న్‌గా ఎంట‌ర్ అయ్యిందే బ‌న్నీ సినిమా ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’తో క‌దా?

This post was last modified on June 2, 2020 9:12 am

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

25 minutes ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

55 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

1 hour ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

1 hour ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

3 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago