సక్సెస్ని ఫాలో అవ్వడమే సక్సెస్ మంత్రం. చిత్రసీమ నమ్మేది అదే. చేతిలో హిట్స్ ఉన్న వాళ్లతోనే పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారు హీరోలు. మహేష్బాబు అందుకు అతీతుడేమీ కాదు.
ఓరకంగా చెప్పాలంటే.. అందరి కంటే ఎక్కువగా సక్సెస్ల చుట్టూ తిరిగేది మహేష్నే. విచిత్రం ఏమిటంటే.. మహేష్ సక్సెస్ఫుల్ దర్శకుడినే కాదు, సక్సెస్ ఫుల్ టీమ్ మొత్తాన్ని తెచ్చుకుంటాడు. ‘సర్కారు వారి పాట’ టీమ్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది.
‘అల వైకుంఠపురములో’ `టీమ్ లో సగం మంది ‘సర్కారు వారి పాట’లో కనిపిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్, కళా దర్శకుడు ప్రకాష్, కెమెరామెన్ వినోద్.. వీళ్లంత ‘అల వైకుంఠపురములో’ టీమే. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఆమె కూడా ఖాయమైపోతే, దర్శకుడు – బ్యానర్ తప్ప దాదాపుగా కీలకమైన వాళ్లంతా ‘వైకుంఠపురములో’ నుంచి తెచ్చుకున్న వాళ్లే అవుతారు.
ప్రతినాయకుడిగా ఉపేంద్ర పేరు పరిశీలనలో ఉంది. ఆయన్నీ తెచ్చుకుంటే.. ఇది మొత్తం బన్నీ టీమ్ అవుతుంది. ఎలాగంటారా? ఉపేంద్ర విలన్గా ఎంటర్ అయ్యిందే బన్నీ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో కదా?
This post was last modified on June 2, 2020 9:12 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…