తగ్గేదే లే.. ‘పుష్ప’ సినిమా మేకింగ్ దశలో ఉండగానే బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. టీజర్లో అల్లు అర్జున్ పలికిన ఈ మాటను మీమ్స్లో తెగ వాడేస్తున్నారు. సినిమాలో బన్నీ పాత్ర ఎంత దూకుడుగా ఉంటుందో చెప్పడానికి ఈ డైలాగే సంకేతం. ఐతే ‘తగ్గేదే లే.. తగ్గేదే లే..’ అంటూ వచ్చిన బన్నీ.. తన సినిమా రిలీజ్ విషయంలో మాత్రం తగ్గడం గమనార్హం. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు ఈ చిత్రం క్రిస్మస్కు విడుదల కావట్లేదు. దానికి వారం ముందే రిలీజవుతోంది. డిసెంబరు 17కు రిలీజ్ డేట్ ఇచ్చారు. ‘పుష్ప’ ఈ డేట్కు రాబోతోందని ఇంతకుముందే ప్రచారం జరిగింది. ఐతే హిందీలో ‘లాల్ సింగ్ చద్దా’ అనే భారీ చిత్రం డిసెంబరు 25న విడుదల కానున్న నేపథ్యంలో వారం ముందే బన్నీ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని అనుకున్నారు. కానీ ఆ సినిమా రేసు నుంచి తప్పుకున్నప్పటికీ ‘పుష్ప’ను 17కే ఫిక్స్ చేశారు.
ఈ విషయంలో సుకుమార్ అండ్ కో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. 17న సినిమాను రిలీజ్ చేస్తే.. ‘పుష్ప’పై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా ఆ వీకెండ్లో వసూళ్ల మోగ మోగుతుంది. ఇక రెండో వారం క్రిస్మస్ సెలవులు కలిసొస్తాయి కాబట్టి అప్పుడు కూడా సందడి ఉంటుంది. సినిమాకు మంచి టాక్ వస్తే.. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తాయి. ఈ రకంగా సినిమాకు లాంగ్ రన్ ఉంటుందన్న అంచనాతో 17నే ‘పుష్ప’ను రిలజీ్ చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఐతే 17న ‘పుష్ప’ ఫిక్స్ అయిన నేపథ్యంలో క్రిస్మస్ వీకెండ్లో ఏదైనా పేరున్న సినిమాను రేసులో నిలుపుతారేమో చూడాలి. అందుకు అవకాశం లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ‘పుష్ప’ టీం అయితే చాలా తెలివిగానే రిలీజ్ డేట్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వచ్చే నెలలోనే టాకీ పార్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు నెలన్నర సమయం ఉంటుంది.
This post was last modified on October 2, 2021 12:22 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…