Movie News

ఆ ఐదు కోట్ల సంగ‌తేంట‌న్న బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త సంచ‌ల‌నానికి తెర తీశారు. తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌తో సినీ ప‌రిశ్రమ సమావేశాల‌కు త‌న‌ను పిల‌వ‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ భూములు పంచుకోవ‌డానికి వెళ్లారంటూ ఆయ‌న కొన్ని రోజుల కింద‌ట చేసిన వ్యాఖ్య‌లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న మెగాస్టార్ చిరంజీవి స‌హా సినీ పెద్దల తీరును విమ‌ర్శిస్తూ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) బిల్డింగ్ కోసం అమెరికాలో చేసిన షో గురించి బాల‌య్య ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాడు. ఇప్పుడు రూ.5 కోట్ల విరాళాల ల‌క్ష్యంతో షో చేశారు క‌దా.. ఆ డ‌బ్బులేమ‌య్యాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించాడు.

‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ కోసం బిల్డింగ్ కడతామని అన్నారు. అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? చిరంజీవిగారు అంతా కలిసి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో ఫంక్షన్ చేశారు. ఐదు కోట్లు అన్నారు. కట్టారా ‘మా’ కోసం బిల్డింగ్. ఇవాళ‌ గవర్నమెంట్ ఎంతో సపోర్టింగ్‌గా ఉంది. అడిగితే రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా? ఇండస్ట్రీ నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? కరోనాని పక్కన పెట్టి ఎందుకు సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని ఆరాటం? కారణం ట్యాక్సులు.. డబ్బు. ఈ సొసైటీలో అత్యధికంగా టాక్స్ పే చేసేది మా ఇండస్ట్రీనే. ఇంత వరకు ‘మా’ బిల్డింగ్ కట్టలేదు. మద్రాస్‌లో చూడండి. మేం డబ్బులు పెట్టి కట్టుకోలేమా అనే ఆ ఆలోచనలు రావు. అక్కడికి వెళ్లారు. ఏదో 5 కోట్లు అన్నారు. తర్వాత కోటి అన్నారు. మిగతా 4 కోట్లు ఏమయ్యాయి? అందుకే నేను ఇలాంటి విష‌యాల్లో ఏం కలుగజేసుకోను. మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి’’ అంటూ బాల‌య్య కౌంట‌ర్లు వేశాడు.

This post was last modified on June 2, 2020 4:04 am

Share
Show comments
Published by
suman

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

1 hour ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

3 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

4 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago