కొంతకాలంగా గమనిస్తే.. ఏ ప్యాన్ ఇండియా సినిమాని అనౌన్స్ చేసినా హీరోయిన్గా కియారా అద్వానీ పేరే వినిపిస్తోంది. చివరికి ఎవరైనా ఖాయం కానివ్వండి.. మొదటగా మాత్రం ఆమె పేరు తెరమీదికి వచ్చేస్తుంది. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. అయితే ఈసారి నిజమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న బైలింగ్వల్ మూవీలో ఫిమేల్ లీడ్గా కియారాని కన్ఫర్మ్ చేశారట. వినయ విధేయ రామ’ బ్యాడ్ రిజల్ట్ ఇచ్చినా.. అంతకు ముందు చేసిన ‘భరత్ అనే నేను’ మాత్రం కియారా ఖాతాలో మంచి విజయాన్ని వేసింది. అందుకే ఆమెకి టాలీవుడ్లో క్రేజ్ ఉంది. కానీ బాలీవుడ్లో బిజీ అయిపోయి సౌత్ వైపు చూడటమే మానేసింది కియారా. ఎట్టకేలకి రామ్ చరణ్, శంకర్ల సినిమాతో ఇటు అడుగు వేసింది. ఆ పరిచయంతోనే దిల్ రాజు ఇప్పుడు విజయ్ సినిమా చేయడానికి కూడా ఆమెని ఒప్పించినట్టు తెలుస్తోంది.
విజయ్ ప్రస్తుతం చేస్తున్న ‘బీస్ట్’ షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ సెట్స్కి వెళ్తుంది. ఈలోపు హీరోయిన్ని కన్ఫర్మ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆల్రెడీ డిస్కషన్స్ పూర్తయ్యాయట. కియారా కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యిందని, ఆమె దాదాపు ఖరారైనట్టేనని టాక్. ప్రస్తుతం హిందీలో భూల్ భులయ్యా 2, జుగ్ జుగ్ జియో, మిస్టర్ లేలే చిత్రాలు చేస్తోంది కియారా. వీటిలో ఒకటి ఆల్రెడీ పూర్తైపోయింది. మిగతావి కూడా చివరి దశకు చేరుకున్నాయి. కాబట్టి డేట్స్ సమస్య కూడా అంతగా లేకపోవచ్చు.
This post was last modified on October 1, 2021 2:57 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…