కొంతకాలంగా గమనిస్తే.. ఏ ప్యాన్ ఇండియా సినిమాని అనౌన్స్ చేసినా హీరోయిన్గా కియారా అద్వానీ పేరే వినిపిస్తోంది. చివరికి ఎవరైనా ఖాయం కానివ్వండి.. మొదటగా మాత్రం ఆమె పేరు తెరమీదికి వచ్చేస్తుంది. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. అయితే ఈసారి నిజమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న బైలింగ్వల్ మూవీలో ఫిమేల్ లీడ్గా కియారాని కన్ఫర్మ్ చేశారట. వినయ విధేయ రామ’ బ్యాడ్ రిజల్ట్ ఇచ్చినా.. అంతకు ముందు చేసిన ‘భరత్ అనే నేను’ మాత్రం కియారా ఖాతాలో మంచి విజయాన్ని వేసింది. అందుకే ఆమెకి టాలీవుడ్లో క్రేజ్ ఉంది. కానీ బాలీవుడ్లో బిజీ అయిపోయి సౌత్ వైపు చూడటమే మానేసింది కియారా. ఎట్టకేలకి రామ్ చరణ్, శంకర్ల సినిమాతో ఇటు అడుగు వేసింది. ఆ పరిచయంతోనే దిల్ రాజు ఇప్పుడు విజయ్ సినిమా చేయడానికి కూడా ఆమెని ఒప్పించినట్టు తెలుస్తోంది.
విజయ్ ప్రస్తుతం చేస్తున్న ‘బీస్ట్’ షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ సెట్స్కి వెళ్తుంది. ఈలోపు హీరోయిన్ని కన్ఫర్మ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆల్రెడీ డిస్కషన్స్ పూర్తయ్యాయట. కియారా కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యిందని, ఆమె దాదాపు ఖరారైనట్టేనని టాక్. ప్రస్తుతం హిందీలో భూల్ భులయ్యా 2, జుగ్ జుగ్ జియో, మిస్టర్ లేలే చిత్రాలు చేస్తోంది కియారా. వీటిలో ఒకటి ఆల్రెడీ పూర్తైపోయింది. మిగతావి కూడా చివరి దశకు చేరుకున్నాయి. కాబట్టి డేట్స్ సమస్య కూడా అంతగా లేకపోవచ్చు.
This post was last modified on October 1, 2021 2:57 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…