పవన్ కళ్యాణ్ వెర్సస్ వైసీపీ గొడవ కాస్తా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెర్సస్ పోసాని కృష్ణమురళి గొడవగా మారిపోతోంది. రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వైకాపా సర్కారును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టడం.. ఆ తర్వాత వైకాపా నుంచి వరుసబెట్టి నాయకులు జనసేనాని మీద మాటల దాడి చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీ మద్దతుదారు అయిన పోసాని కృష్ణమురళి కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ మీద విమర్శలు చేశారు.
ఐతే అంతటితో కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ కొత్త గొడవ మొదలైంది. పవన్ అభిమానులు తనకు, తన భార్యకు ఫోన్ చేసి దారుణమైన మాటలు మాట్లాడారు, బెదిరించారంటూ పోసాని ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోయారు. పవన్ను బూతులు తిడుతూ ఆయన భార్య, కూతురి గురించి దారుణమైన కామెంట్స్ చేశారు. ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నపుడే పవన్ అభిమానులు బయట గొడవ చేయడం తెలిసిందే.
కాగా ఇప్పుడు పవన్ అభిమానులు తమ ఇంటిపై రాళ్ల దాడి చేసినట్లుగా పోసాని ఆరోపిస్తుండటం గమనార్హం. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటిపై రాళ్లు వేశారని, వాళ్లు పవన్ అభిమానులే అని పోసాని అంటున్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఐతే ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారం జరుగుతున్న నాటకం అంటూ పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మొన్న తనకు, తన భార్యకు ఫోన్ చేసి పవన్ అభిమానులు తిట్టారని చెబుతూ పోసాని వాళ్లు ఎవరో ఏంటో వెల్లడించకుండా పవన్ మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు మరోసారి పవన్ అభిమానులు ఇంటిపై దాడి చేశారని వివాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని వారంటున్నారు.
2019 ఎన్నికలకు ముందు కత్తి మహేష్ విషయంలో జరిగినట్లే ఇప్పుడు పోసాని విషయంలోనూ జరుగుతోందని.. ఇదంతా ఏపీలో సీరియస్ ఇష్యూల మీది నుంచి దృష్టి మళ్లించేందుకు జరుగుతున్న డ్రామా అని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…