ఇప్పుడు తమన్ ఉన్న ఊపులో ఇండియాలో మరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా లేడు అంటే అతిశయోక్తి కాదు. సినిమా సంఖ్య పరంగా చూసినా, వాటి స్థాయి పరంగా చూసినా ఎవరూ అతడికి దరిదాపుల్లో లేరు. ఏక కాలంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి బడా స్టార్ల సినిమాలకు సంగీతం అందించడమంటే మామూలు విషయం కాదు.
ప్రతి సంగీత దర్శకుడికీ ఫలానా స్టార్ సినిమాకు, ఫలానా అగ్ర దర్శకుడి చిత్రానికి సంగీతం అందించాలని కొన్ని కలలు ఉంటాయి. కానీ కొందరే వాటిని నెరవేర్చుకుంటాడు. తమన్ అలా గత కొన్నేళ్లలో చాలా కలలే నెరవేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లాంటి ప్రముఖులతో పని చేశాడు. తాజాగా సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ కూడా పట్టేశాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ తీయబోయే సినిమాకు తమనే సంగీత దర్శకుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తమన్ మరో కల నెరవేరే సమయం వచ్చినట్లు సమాచారం. అతను తొలిసారిగా ఇళయ దళపతి విజయ్ సినిమాకు మ్యూజిక్ చేయబోతున్నాడట. తమన్ తమిళంలోనూ కొన్ని సినిమాలు చేశాడు కానీ.. తెలుగులో మాదిరి అక్కడ పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం తమిళంలో విజయే నంబర్ వన్ హీరో.
సూపర్స్టార్ రజినీకాంత్ను కూడా వెనక్కి నెట్టేసి తిరుగులేని రేంజికి చేరుకున్నాడు. విజయ్తో సినిమా చేయాలన్న ఆశను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీర్చేస్తున్నాడట. దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి సినిమాను తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి తమన్ను సంగీత దర్శకుడిగా ఖరారు చేశారట. ఇరు భాషల ప్రేక్షకులకూ నచ్చే సంగీతం ఇవ్వగల, మంచి ఫామ్లో ఉన్న తమనే ఈ సినిమాకు కరెక్ట్ అని ఫీలయ్యి అతడికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ బిగ్ ఛాన్స్ను తమన్ ఎంత బాగా ఉపయోగించుకుంటాడో చూడాలి మరి.
This post was last modified on September 28, 2021 8:51 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…