దివంగత నటి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. తమిళనాట ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. విజయేంద్రప్రసాద్ లాంటి రైట్స్ ఉన్నప్పటికీ.. సరైన ఎలివేషన్స్ లేవని, కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా సాగిందని విమర్శలు వినిపించాయి.
జయలలిత బయోపిక్ మాదిరి లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమా విషయంలో విజయేంద్రప్రసాద్ సైతం అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. సినిమాలో ఆయన రాసిన చాలా సన్నివేశాలను పక్కన పెట్టేశారట.
విజయేంద్రప్రసాద్ కాకుండా.. దర్శకుడు విజయ్ మరికొంత మంది రైటర్లను పెట్టుకొని డిఫరెంట్ వెర్షన్స్ రాయించుకున్నాడట. దీంతో సినిమా విడుదలైన రోజే దర్శకనిర్మాతలతో విజయేంద్రప్రసాద్ తన అసంతృప్తిని వెళ్లగక్కారని టాక్.
ఈ సినిమా చుట్టూ చాలానే వివాదాలు తిరిగాయి. ఇప్పుడు బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు విజయ్ పై గుర్రుగా ఉన్నారని సమాచారం. అనుకున్న బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయలేకపోవడం, ఇప్పుడు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో.. విజయ్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకునేలా నిర్మాతలు పావులు కదుపుతున్నారు.
This post was last modified on September 28, 2021 7:11 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…