దివంగత నటి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. తమిళనాట ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. విజయేంద్రప్రసాద్ లాంటి రైట్స్ ఉన్నప్పటికీ.. సరైన ఎలివేషన్స్ లేవని, కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా సాగిందని విమర్శలు వినిపించాయి.
జయలలిత బయోపిక్ మాదిరి లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమా విషయంలో విజయేంద్రప్రసాద్ సైతం అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. సినిమాలో ఆయన రాసిన చాలా సన్నివేశాలను పక్కన పెట్టేశారట.
విజయేంద్రప్రసాద్ కాకుండా.. దర్శకుడు విజయ్ మరికొంత మంది రైటర్లను పెట్టుకొని డిఫరెంట్ వెర్షన్స్ రాయించుకున్నాడట. దీంతో సినిమా విడుదలైన రోజే దర్శకనిర్మాతలతో విజయేంద్రప్రసాద్ తన అసంతృప్తిని వెళ్లగక్కారని టాక్.
ఈ సినిమా చుట్టూ చాలానే వివాదాలు తిరిగాయి. ఇప్పుడు బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు విజయ్ పై గుర్రుగా ఉన్నారని సమాచారం. అనుకున్న బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయలేకపోవడం, ఇప్పుడు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో.. విజయ్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకునేలా నిర్మాతలు పావులు కదుపుతున్నారు.
This post was last modified on September 28, 2021 7:11 am
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…