పోయినేడాది కరోనా ఫస్ట్ వేవ్ సినీ పరిశ్రమను షేక్ చేసి వదిలిపెట్టాక.. మధ్యలో కొన్ని నెలలు మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టైంలో పెద్ద ఎత్తునే సినిమాలు రిలీజయ్యాయి. ఇక కరోనా భయం లేదని.. దాని కథ ముగిసిందని అనుకుని చాలా ఉత్సాహంగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటించారు.
మళ్లీ అవకాశం దొరకదేమో అన్నట్లుగా ముందు వెనుక చూసుకోకుండా కొన్ని రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో సినిమాలకు రిలీజ్ డేట్లు ఇవ్వడం గుర్తుండే ఉంటుంది. ఏమిటీ మ్యాడ్నెస్ అంటూ ప్రశ్నలు తలెత్తినా ఎవరూ తగ్గలేదు. తమ సినిమా ఏ దశలో ఉంది.. ఎప్పటికి పూర్తవుతుంది.. డెడ్ లైన్ అందుకోగలమా లేదా.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉండబోతోంది.. అన్నది చూసుకోకుండా విడుదల తేదీలు ప్రకటించారు. కానీ తీరా చూస్తే ఏమైంది..? సెకండ్ వేవ్ దెబ్బకు అంతా తలకిందులైంది. అన్ని సినిమాలకూ రిలీజ్ డేట్లు మార్చుకోక తప్పలేదు.
ఇప్పుడు బాలీవుడ్ కూడా అదే తప్పు చేస్తోంది. వచ్చే నెల 22 నుంచి మహారాష్ట్రాలో థియేటర్లు తెరుచుకోవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇలా ప్రకటించాడో లేదో.. ఇలా బాలీవుడ్ వాళ్లకు పూనకాలు వచ్చేశాయి. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 20 సినిమాలకు రిలీజ్ డేట్లు ఇచ్చేశారు. అసలు మహారాష్ట్రపై కరోనా ప్రభావం ఏ స్థాయిలో పడిందో అందరికీ తెలుసు. ముందు అనుకున్నట్లుగా ప్రస్తుతానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పెద్దగా కనిపించడం లేదు. అలాగని ప్రభావమే ఉండదని కొట్టిపారేయలేం.
అసలు వచ్చే నెల 22న అనుకున్నట్లుగా థియేటర్లు తెరుచుకుంటాయో లేదో కూడా గ్యారెంటీ లేదు. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అస్సలు ఛాన్స్ తీసుకోవట్లేదు. ఒకవేళ ఆ టైంకి థియేటర్లు తెరుచుకున్నా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ బాలీవుడ్ వాళ్లు మాత్రం ఇక ఎప్పటికీ ఏ ఇబ్బంది ఉండదన్నట్లుగా వచ్చే వేసవికి కూడా బెర్తులు బుక్ చేసేశారు. టాలీవుడ్ తరహాలోనే తొందరపడ్డారు. మరి వీళ్ల ప్రణాళికలు ఏమేర ఫలిస్తాయో చూడాలి.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…