పోయినేడాది కరోనా ఫస్ట్ వేవ్ సినీ పరిశ్రమను షేక్ చేసి వదిలిపెట్టాక.. మధ్యలో కొన్ని నెలలు మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టైంలో పెద్ద ఎత్తునే సినిమాలు రిలీజయ్యాయి. ఇక కరోనా భయం లేదని.. దాని కథ ముగిసిందని అనుకుని చాలా ఉత్సాహంగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటించారు.
మళ్లీ అవకాశం దొరకదేమో అన్నట్లుగా ముందు వెనుక చూసుకోకుండా కొన్ని రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో సినిమాలకు రిలీజ్ డేట్లు ఇవ్వడం గుర్తుండే ఉంటుంది. ఏమిటీ మ్యాడ్నెస్ అంటూ ప్రశ్నలు తలెత్తినా ఎవరూ తగ్గలేదు. తమ సినిమా ఏ దశలో ఉంది.. ఎప్పటికి పూర్తవుతుంది.. డెడ్ లైన్ అందుకోగలమా లేదా.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉండబోతోంది.. అన్నది చూసుకోకుండా విడుదల తేదీలు ప్రకటించారు. కానీ తీరా చూస్తే ఏమైంది..? సెకండ్ వేవ్ దెబ్బకు అంతా తలకిందులైంది. అన్ని సినిమాలకూ రిలీజ్ డేట్లు మార్చుకోక తప్పలేదు.
ఇప్పుడు బాలీవుడ్ కూడా అదే తప్పు చేస్తోంది. వచ్చే నెల 22 నుంచి మహారాష్ట్రాలో థియేటర్లు తెరుచుకోవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇలా ప్రకటించాడో లేదో.. ఇలా బాలీవుడ్ వాళ్లకు పూనకాలు వచ్చేశాయి. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 20 సినిమాలకు రిలీజ్ డేట్లు ఇచ్చేశారు. అసలు మహారాష్ట్రపై కరోనా ప్రభావం ఏ స్థాయిలో పడిందో అందరికీ తెలుసు. ముందు అనుకున్నట్లుగా ప్రస్తుతానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పెద్దగా కనిపించడం లేదు. అలాగని ప్రభావమే ఉండదని కొట్టిపారేయలేం.
అసలు వచ్చే నెల 22న అనుకున్నట్లుగా థియేటర్లు తెరుచుకుంటాయో లేదో కూడా గ్యారెంటీ లేదు. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అస్సలు ఛాన్స్ తీసుకోవట్లేదు. ఒకవేళ ఆ టైంకి థియేటర్లు తెరుచుకున్నా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ బాలీవుడ్ వాళ్లు మాత్రం ఇక ఎప్పటికీ ఏ ఇబ్బంది ఉండదన్నట్లుగా వచ్చే వేసవికి కూడా బెర్తులు బుక్ చేసేశారు. టాలీవుడ్ తరహాలోనే తొందరపడ్డారు. మరి వీళ్ల ప్రణాళికలు ఏమేర ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on September 27, 2021 6:35 pm
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…