టాలీవుడ్ లో ఉన్న హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా ప్రతి ఒక్కరూ రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉండేలా చూసుకుంటున్నారు. యంగ్ హీరో నాగశౌర్య ఏకంగా ఆరు సినిమాలను పట్టాలెక్కించారు. ఈ అరడజను ప్రాజెక్ట్స్ కూడా షూటింగ్ దశలో ఉంది. అందులో రెండు సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవి కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతుండడం విశేషం.
లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య రూపొందించిన ‘వరుడు కావలెను’ సినిమాలో శౌర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు శౌర్య నటిస్తోన్న మరో సినిమా ‘లక్ష్య’ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
విలువిద్య నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ తో కలిసి శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా ‘వరుడు కావలెను’ విడుదలైన వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే నెల గ్యాప్ లో శౌర్య నటించిన రెండు సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయన్నమాట. ఆయన నటిస్తోన్న మిగిలిన సినిమాలను 2022లో విడుదల చేయనున్నారు.
This post was last modified on September 27, 2021 4:20 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…