టాలీవుడ్ లో ఉన్న హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా ప్రతి ఒక్కరూ రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉండేలా చూసుకుంటున్నారు. యంగ్ హీరో నాగశౌర్య ఏకంగా ఆరు సినిమాలను పట్టాలెక్కించారు. ఈ అరడజను ప్రాజెక్ట్స్ కూడా షూటింగ్ దశలో ఉంది. అందులో రెండు సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవి కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతుండడం విశేషం.
లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య రూపొందించిన ‘వరుడు కావలెను’ సినిమాలో శౌర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు శౌర్య నటిస్తోన్న మరో సినిమా ‘లక్ష్య’ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
విలువిద్య నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ తో కలిసి శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా ‘వరుడు కావలెను’ విడుదలైన వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే నెల గ్యాప్ లో శౌర్య నటించిన రెండు సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయన్నమాట. ఆయన నటిస్తోన్న మిగిలిన సినిమాలను 2022లో విడుదల చేయనున్నారు.
This post was last modified on September 27, 2021 4:20 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…