టాలీవుడ్ లో ఉన్న హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా ప్రతి ఒక్కరూ రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉండేలా చూసుకుంటున్నారు. యంగ్ హీరో నాగశౌర్య ఏకంగా ఆరు సినిమాలను పట్టాలెక్కించారు. ఈ అరడజను ప్రాజెక్ట్స్ కూడా షూటింగ్ దశలో ఉంది. అందులో రెండు సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవి కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతుండడం విశేషం.
లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య రూపొందించిన ‘వరుడు కావలెను’ సినిమాలో శౌర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు శౌర్య నటిస్తోన్న మరో సినిమా ‘లక్ష్య’ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
విలువిద్య నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ తో కలిసి శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా ‘వరుడు కావలెను’ విడుదలైన వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే నెల గ్యాప్ లో శౌర్య నటించిన రెండు సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయన్నమాట. ఆయన నటిస్తోన్న మిగిలిన సినిమాలను 2022లో విడుదల చేయనున్నారు.
This post was last modified on September 27, 2021 4:20 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…