‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ వేడెక్కుతోంది. ఇంకో రెండు వారాల్లోనే ఎన్నికల జరగనుండటంతో ఇటు ప్రకాష్ రాజ్ వర్గం, అటు మంచు విష్ణు వర్గం అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సోమవారమే నామినేషన్లు ఫైల్ చేయగా.. మంచు విష్ణు బృందం కూడా ఒకట్రెండు రోజుల్లో నామినేషన్లు వేయబోతోంది. ఇలాంటి తరుణంలో ఓ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ మంచు విష్ణు ‘మా’ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఎవరికి ఉందో వాళ్లే విజేత అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. చిరు ఓటు తనకే అని విష్ణు ప్రకటించడం విశేషం. త్వరలోనే తమ బృందం తరఫున నామినేషన్లు వేసి.. ఆ తర్వాత చిరంజీవిని కలుస్తానని… కచ్చితంగా ఆయన తమకు మద్దతు పలుకుతాడని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు.
తమ ప్యానెల్ మ్యానిఫెస్టో చూపించి, తాను ఏం చేయాలనుకుంటున్నానో వివరిస్తే కచ్చితంగా చిరంజీవి ఓటు తనకే పడుతుందని మంచు విష్ణు అన్నాడు. ‘మా’ కోసం ఏం చేయాలనే విషయంపై తన దగ్గర పక్కాగా ప్రణాళికలు ఉన్నాయని విష్ణు చెప్పాడు. ప్రకాష్ రాజ్ కంటే తానే ‘మా’ కోసం ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలనని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు. తాను ‘మా’ అధ్యక్షుణ్ని అయితే అప్పు చేసి అయినా ‘మా’ కోసం సొంత భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని అతనన్నాడు.
అంతటితో పరిమితం కాకుండా ‘మా’ సభ్యుల పిల్లల చదువు విషయంలోనూ ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలనుకుంటున్నానని.. ఈ విషయంలో వేరే వాళ్లకు అంత ప్లాన్ ఉందని తాను భావించడం లేదని విష్ణు అన్నాడు. ఐతే విష్ణు ఇంత ధీమాగా చిరు మద్దతు తనకే అంటున్నాడు కానీ.. ఇండస్ట్రీ జనాలు మాత్రం ప్రకాష్ రాజ్ వెనుక చిరు ఉన్నాడని అనుకుంటున్నారు. మరి చిరు బహిరంగంగా ఈ ఇద్దరిలో ఎవరికైనా మద్దతు ప్రకటిస్తారేమో చూడాలి.
This post was last modified on September 27, 2021 1:46 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…