Movie News

చిరంజీవి ఓటు నాకే-మంచు విష్ణు

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ వేడెక్కుతోంది. ఇంకో రెండు వారాల్లోనే ఎన్నికల జరగనుండటంతో ఇటు ప్రకాష్ రాజ్ వర్గం, అటు మంచు విష్ణు వర్గం అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సోమవారమే నామినేషన్లు ఫైల్ చేయగా.. మంచు విష్ణు బృందం కూడా ఒకట్రెండు రోజుల్లో నామినేషన్లు వేయబోతోంది. ఇలాంటి తరుణంలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ మంచు విష్ణు ‘మా’ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఎవరికి ఉందో వాళ్లే విజేత అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. చిరు ఓటు తనకే అని విష్ణు ప్రకటించడం విశేషం. త్వరలోనే తమ బృందం తరఫున నామినేషన్లు వేసి.. ఆ తర్వాత చిరంజీవిని కలుస్తానని… కచ్చితంగా ఆయన తమకు మద్దతు పలుకుతాడని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు.

తమ ప్యానెల్ మ్యానిఫెస్టో చూపించి, తాను ఏం చేయాలనుకుంటున్నానో వివరిస్తే కచ్చితంగా చిరంజీవి ఓటు తనకే పడుతుందని మంచు విష్ణు అన్నాడు. ‘మా’ కోసం ఏం చేయాలనే విషయంపై తన దగ్గర పక్కాగా ప్రణాళికలు ఉన్నాయని విష్ణు చెప్పాడు. ప్రకాష్ రాజ్ కంటే తానే ‘మా’ కోసం ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలనని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు. తాను ‘మా’ అధ్యక్షుణ్ని అయితే అప్పు చేసి అయినా ‘మా’ కోసం సొంత భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని అతనన్నాడు.

అంతటితో పరిమితం కాకుండా ‘మా’ సభ్యుల పిల్లల చదువు విషయంలోనూ ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలనుకుంటున్నానని.. ఈ విషయంలో వేరే వాళ్లకు అంత ప్లాన్ ఉందని తాను భావించడం లేదని విష్ణు అన్నాడు. ఐతే విష్ణు ఇంత ధీమాగా చిరు మద్దతు తనకే అంటున్నాడు కానీ.. ఇండస్ట్రీ జనాలు మాత్రం ప్రకాష్ రాజ్ వెనుక చిరు ఉన్నాడని అనుకుంటున్నారు. మరి చిరు బహిరంగంగా ఈ ఇద్దరిలో ఎవరికైనా మద్దతు ప్రకటిస్తారేమో చూడాలి.

This post was last modified on September 27, 2021 1:46 pm

Share

Recent Posts

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

34 minutes ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

49 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

1 hour ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

1 hour ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

3 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

4 hours ago