‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ వేడెక్కుతోంది. ఇంకో రెండు వారాల్లోనే ఎన్నికల జరగనుండటంతో ఇటు ప్రకాష్ రాజ్ వర్గం, అటు మంచు విష్ణు వర్గం అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సోమవారమే నామినేషన్లు ఫైల్ చేయగా.. మంచు విష్ణు బృందం కూడా ఒకట్రెండు రోజుల్లో నామినేషన్లు వేయబోతోంది. ఇలాంటి తరుణంలో ఓ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ మంచు విష్ణు ‘మా’ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఎవరికి ఉందో వాళ్లే విజేత అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. చిరు ఓటు తనకే అని విష్ణు ప్రకటించడం విశేషం. త్వరలోనే తమ బృందం తరఫున నామినేషన్లు వేసి.. ఆ తర్వాత చిరంజీవిని కలుస్తానని… కచ్చితంగా ఆయన తమకు మద్దతు పలుకుతాడని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు.
తమ ప్యానెల్ మ్యానిఫెస్టో చూపించి, తాను ఏం చేయాలనుకుంటున్నానో వివరిస్తే కచ్చితంగా చిరంజీవి ఓటు తనకే పడుతుందని మంచు విష్ణు అన్నాడు. ‘మా’ కోసం ఏం చేయాలనే విషయంపై తన దగ్గర పక్కాగా ప్రణాళికలు ఉన్నాయని విష్ణు చెప్పాడు. ప్రకాష్ రాజ్ కంటే తానే ‘మా’ కోసం ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలనని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు. తాను ‘మా’ అధ్యక్షుణ్ని అయితే అప్పు చేసి అయినా ‘మా’ కోసం సొంత భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని అతనన్నాడు.
అంతటితో పరిమితం కాకుండా ‘మా’ సభ్యుల పిల్లల చదువు విషయంలోనూ ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలనుకుంటున్నానని.. ఈ విషయంలో వేరే వాళ్లకు అంత ప్లాన్ ఉందని తాను భావించడం లేదని విష్ణు అన్నాడు. ఐతే విష్ణు ఇంత ధీమాగా చిరు మద్దతు తనకే అంటున్నాడు కానీ.. ఇండస్ట్రీ జనాలు మాత్రం ప్రకాష్ రాజ్ వెనుక చిరు ఉన్నాడని అనుకుంటున్నారు. మరి చిరు బహిరంగంగా ఈ ఇద్దరిలో ఎవరికైనా మద్దతు ప్రకటిస్తారేమో చూడాలి.
This post was last modified on September 27, 2021 1:46 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…