కెరీర్ స్టార్ట్ చేసి పద్నాలుగేళ్లు దాటినా టాప్ హీరోయిన్గానే వెలుగుతోంది కాజల్. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేసింది. ఇండియన్ 2, ఆచార్య, ద ఘోస్ట్ లాంటి భారీ చిత్రాలతో పాటు ఉమ, హే సినామికా లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకూ బెస్ట్ చాయిస్గా నిలిచింది. అయితే రీసెంట్గా ఆమె ‘ద ఘోస్ట్’ మూవీ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆ స్థానంలో ఇలియానాని తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలియానా ఇప్పుడు ఫామ్లో లేదు. టాలీవుడ్లో ఆమె ఫాలోయింగ్ పూర్తిగా తగ్గిపోయింది కూడా. అందుకే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ని ఫైనల్ చేశారని అంటున్నారు.
అసలిప్పుడీ మార్పు ఎందుకంటే.. కాజల్ తల్లి కాబోతోందని తెలియడమే. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నాగ్తో పాటు కాజల్ కూడా పవర్ఫుల్ రోల్ చేస్తోంది. ఆమె స్టంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కావడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక కాజల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.
అయితే తాను కన్సీవ్ అయినట్టు కాజల్ ఇంతవరకు క్లూ ఇవ్వలేదు. టీమ్ కూడా పాత హీరోయిన్ తప్పకుందని కానీ, కొత్త హీరోయిన్ని తీసుకుంటున్నామని కానీ కన్ఫర్మ్ చేయలేదు. దాంతో అసలిది ఎంతవరకు కరెక్ట్ అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజమే అయితే జాక్వెలిన్ మంచి చాయిస్ అనే చెప్పాలి.
గొప్పగా చెప్పుకునే విజయాలైతే లేవు కానీ జాక్కి క్రేజ్ మాత్రం కావలసినంత ఉంది. సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోస్తో యూత్ మతులు పోగొడుతూనే ఉంటుంది. అదే ఆమెకి సౌత్లో కూడా అవకాశాలు తెచ్చిపెడుతోంది. సుదీప్తో ‘విక్రాంత్ రోనా’లో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లోనూ కనిపించబోతోంది. ఇప్పుడు నాగ్ సరసన కూడా చాన్స్ కొట్టిందంటే ఇక దక్షిణాదిన కూడా చక్రం తిప్పడం ఖాయం.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…