‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఫంక్షన్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను షురూ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమా గురించి జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. ఓవర్ నైట్ ఆ సినిమా మీద కొత్త ఆసక్తితో పాటు..ఆ సినిమా కార్యక్రమానికి సంబంధించిన అంశం ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
తనను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడిన పవన్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా సొంత అన్న మొదలు ఎవరిని వదిలిపెట్టలేదు పవన్ కల్యాణ్.
ఏపీ మంత్రి పేర్ని నానిని అయితే.. ఏకంగా సన్నాసి మంత్రి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించటమే కాదు.. అదే పనిగా ఆయన నోటి నుంచి ‘సన్నాసి’ పదం రావటం చూస్తే.. పవన్ ఆగ్రహం ఏ స్థాయిలో ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా మారింది. సభలోనే ఉన్న దిల్ రాజును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘దిల్ రాజుగారూ! మీరు నాతో సినిమా తీయకుంటే ఆంధ్రాలో సినిమాలను అడ్డుకునే వారు కాదు. మీరూ రెడ్డి, వారూ రెడ్డే కదా! మీరూ మీరూ తేల్చుకోండి. మమ్మల్ని బతికించండి’ అన్న పవన్.. దిల్ రాజును రెడ్డిగా పిలవాలంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దిల్ రాజు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఆయన కులం పేరు పెద్దగా ఎప్పుడూ చర్చకు రాదు.
ఆ మాటకు వస్తే.. తన సామాజిక వర్గాన్ని తెలిసేలా వ్యవహరించటానికి దిల్ రాజుకు ఇష్టం ఉండదని చెబుతారు. అలాంటి దిల్ రాజు సామాజిక వర్గాన్ని ప్రస్తావించటంతో పాటు.. ‘మీరు రెడ్లు.. వాళ్లు రెడ్లు.. మీరు కాస్త మాట్లాడితే.. సీఎం జగన్ ఏమైనా ఒప్పుకుంటారేమో’ అంటూ సరదాగా చేసిన వ్యాఖ్య అందరిని ఆకర్షిస్తోంది.
This post was last modified on September 26, 2021 11:31 am
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…