కొన్ని వారాలుగా తెలుగు సినీ ప్రేమికుల చర్చల్లో సినిమాలను మించి ఒక సినిమా జంట వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఆ జంట అక్కినేని నాగచైతన్య, సమంతలదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రేమించి పెళ్లి చేసుకుని దాదాపు నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. విడిపోతున్నట్లుగా కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఇద్దరూ కలిసి కనిపించకపోవడం.. సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు స్పందించకపోవడం.. సమంత తన ఇంటి పేరులోంచి అక్కినేని తీసేయడం లాంటి పరిణామాలు ఈ అనుమానాలను పెంచుతున్నాయి.
కానీ వాస్తవంగా ఏం జరుగుతోందో స్పష్టత లేదు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేవాళ్లు కరవయ్యారు. చైతూ, సమంత.. అలాగే అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఈ విషయంలో నోరు మెదపట్లేదు.
తిరుమలకు వచ్చిన సమంతను చైతూతో విడాకుల గురించి జరుగుతున్న ప్రచారంపై అడిగితే ఆగ్రహించింది. నాగచైతన్య ఏమో.. లవ్ స్టోరి ప్రమోషన్లలో సమంత గురించి ప్రశ్నలే రాకూడదని ముందే కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయినా సరే.. అతడికి సంబంధిత ప్రశ్నను ఎదుర్కోక తప్పలేదు. దీనికి చైతూ ఇచ్చిన సమాధానం అందరికీ దిమ్మదిరిగేలా చేసింది. సూటిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. తాను సినీ, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూస్తానని.. వ్యక్తిగత జీవితం గురించి స్పందించడం ఇష్టముండదని.. తన గురించి మీడియాలో వచ్చిన వార్తలు బాధ పెట్టాయని వ్యాఖ్యానించాడు.
ఐతే ఈ వ్యాఖ్యల ద్వారా చైతూ ఏం చెప్పదలుచుకున్నాడన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. వ్యక్తిగత విషయాలపై మాట్లాడనంటే.. జనాలకు విషయం బోధపడేది. కానీ తన గురించి వచ్చిన వార్తలు బాధ పెట్టాయి అన్నాడంటే దాని ఉద్దేశమేంటో మరి? సమంత నుంచి విడిపోతుండటం నిజమే కానీ, మీడియాలో దాని గురించి వార్తలు రావడం కరెక్ట్ కాదంటున్నాడా.. లేక మీడియాలో వస్తున్నది అబద్ధం అంటున్నాడా..? ఏం చెప్పదలుచుకున్నాడో సూటిగా చెప్పాలింది లేదా.. దీనిపై మాట్లాడను అనేసి ఊరుకోవాల్సింది. అలా కాకుండా ఇలా కన్ఫ్యూజ్ చేయడమేంటో?
This post was last modified on September 24, 2021 11:29 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…