తెలుగులో ఒక ప్రత్యేకమైన శైలిలో సినిమాలు తీస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. తొలి చిత్రం ఆనంద్తోనే దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన ఆయన.. ఆ తర్వాత గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. ఇప్పుడు లవ్ స్టోరి లాంటి మరో స్పెషల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐతే ఈ సినిమా ఒక దశ వరకు ప్రేక్షకుల అంచనాలను అందుకుంది.
ప్రథమార్ధంలో శేఖర్ మార్కు బ్యూటిఫుల్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ అయ్యేసరికి మంచి అనుభూతినే కలిగిస్తుంది లవ్ స్టోరి. కానీ సెకండాఫ్లో సినిమా అనుకున్నంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కులం, లైంగిక వేధింపుల చుట్టూ కథను నడపడంతో సినిమా భారంగా తయారైంది. ఇక్కడ కమ్ముల మార్కు మిస్ అయిపోయింది. చాలా వరకు రొటీన్గా సాగిపోయి.. రొటీన్గా ముగిసిపోయిందీ సినిమా.
కమ్ములతో మొదట్నుంచి ఉన్న సమస్యే ఇది. ఆయన మెజారిటీ సినిమాల్లో ఫస్టాఫ్ మంచి హై ఇచ్చి.. సెకండాఫ్కు వచ్చేసరికి గ్రాఫ్ పడిపోవడం గమనించవచ్చు. లీడర్ మూవీ ఇంటర్వెల్ దగ్గరికొచ్చేసరికి వావ్ అనిపిస్తుంది. కానీ సెకండాఫ్లో ఇంటెన్సిటీ మిస్ అయి.. అంచనాలను అందుకోలేక నిరాశ పరుస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా కొంత వరకు ఇంతే.
ఇక శేఖర్ చివరి సినిమా ఫిదా కూడా ఈ కోవకు చెందిందే. ప్రథమార్ధంలో ఓ రేంజిలో ఎంటర్టైన్ చేసే ఈ చిత్రం.. సెకండాఫ్లో నెమ్మదిగా, కొంచెం భారంగా సాగి విసిగిస్తుంది. కాకపోతే ఆ సినిమాపై ముందు మరీ అంచనాలేమీ లేకపోవడం.. ఫస్టాఫ్తోనే ప్రేక్షకులు వినోదంలో మునిగి తేలడంతో సెకండాఫ్ లోపాలు కవరైపోయి సినిమా బ్లాక్బస్టర్ అయింది. కానీ లవ్ స్టోరి మీద అంచనాలు బాగా ఎక్కువైపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా లేకపోవడం, ముఖ్యంగా సెకండాఫ్లో కమ్ముల వీక్నెస్ కొనసాగడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
This post was last modified on September 24, 2021 11:14 pm
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…