తొలి సినిమాతో బ్లాక్బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడికి ఆటోమేటిగ్గా అవకాశాలు క్యూ కట్టేస్తాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి సినిమా అవకాశం దక్కించుకుని దాంతో విజయాన్నందుకున్నాక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలు లైన్లో పెట్టి చకచకా లాగించేస్తుంటారు దర్శకులు. కానీ ‘ఉప్పెన’తో భారీ విజయాన్నందుకున్న బుచ్చిబాబు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తొలి సినిమాలో అతడి పనితనాన్ని అందరూ మెచ్చుకున్నారు. తనతో పని చేయడానికి పెద్ద స్టార్లు కూడా ఉత్సాహం చూపించారు. కానీ ఎంతకీ అతడి రెండో సినిమా మాత్రం ఓకే కాకపోవడం.. పట్టాలెక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ లాంటి బడా హీరోనే బుచ్చిబాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. వాళ్లిద్దరికీ ముందు నుంచి ఉన్న సాన్నిహిత్యం కూడా కలిసి సినిమా చేయడానికి ఉపయోగపడేదే. కానీ ఎన్టీఆర్కు ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్ల వల్ల రెండు మూడేళ్లు బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు.
దీంతో వేరే స్టార్ల కోసం ట్రై చేస్తున్నాడు కానీ.. ఎంతకీ ఎవ్వరూ పచ్చ జెండా ఊపట్లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లందరూ బిజీగా ఉండటం, వెంటనే బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశం లేకపోవడం సమస్యగా మారింది. మళ్లీ తన తొలి చిత్ర హీరో వైష్ణవ్ తేజ్తోనే బుచ్చిబాబు తన రెండో సినిమా కూడా చేస్తాడని వార్తలొచ్చాయి కానీ.. అది కూడా జరిగేలా కనిపించడం లేదు. తాజా కబురేంటంటే.. బుచ్చిబాబు సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశాడట. వీరి మధ్య జరిగిన మీటింగ్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఒకవేళ బుచ్చిబాబు.. మహేష్కు కథ చెప్పాడా.. సూపర్ స్టార్కు అది నచ్చిందా అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మహేష్కు కథ నచ్చినా అతను కూడా ఖాళీ అవ్వడానికి టైం పడుతుంది. తొలి సినిమాతో భారీ విజయాన్నందుకున్న నేపథ్యంలో పెద్ద స్టార్తో సినిమా చేసి తన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లాలని బుచ్చిబాబు భావిస్తున్నట్లుంది. మరి బుచ్చిబాబుకు వెంటనే డేట్లు ఇచ్చి సినిమా చేసే స్టార్ ఎవరన్నదే ప్రశ్న.
This post was last modified on September 24, 2021 2:39 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…