కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఆ సినిమాకు బాక్సాఫీస్ పరిస్థితులు కలిసొచ్చి వసూళ్లు బాగానే వచ్చాయి కానీ.. ప్రేక్షకులు చాలా వరకు ఈ సినిమా చూసి పెదవి విరిచారు. తేజు కొంచెం బలమైన కథలతో రావాలనే అభిప్రాయం వినిపించిందప్పుడు. అందుకు తగ్గట్లే అతను ‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్టా డైరెక్షన్లో ‘రిపబ్లిక్’ సినిమాను లైన్లో పెట్టాడు. ‘ప్రస్థానం’ తరహాలోనే రాజకీయ, సామాజిక అంశాలతో ఒక సీరియస్ కథను చెప్పే ప్రయత్నం చేసినట్లున్నాడు దేవా ఈ చిత్రంలో.
అక్టోబరు 1న ‘రిపబ్లిక్’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బుధవారం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా దీని ట్రైలర్ లాంచ్ చేశారు. మిగతా వ్యవస్థలన్నింటినీ కమ్మేసి ఆధిపత్యం చలాయిస్తున్న పొలిటికల్ సిస్టమ్ మీద పోరాటం చేసే సివిలి సర్వెంట్ పాత్రలో తేజు చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాడు సినిమాలో.
ట్రైలర్ ఆద్యంతం ఒక ఇంటెన్సిటీతో సాగి ఆకట్టుకుంది. విజువల్స్ బాగున్నాయి. తేజు పాత్రతో పాటు రమ్యకృష్ణ, జగపతిబాబు క్యారెక్టర్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఐతే అంతా బాగుంది కానీ.. ఇంత సీరియస్ సినిమా ఈ రోజుల్లో ఏమాత్రం ఆడుతుందనే డౌట్లు కొడుతున్నాయి. ఈ తరం ప్రేక్షకులు సీరియస్ సినిమాల పట్ల అంతగా ఆసక్తి ప్రదర్శించట్లేదు. అందులోనూ సామాజిక అంశాలు, సందేశాలు అంటే నిరాసక్తతతో కనిపిస్తున్నారు. ఎంటర్టైనర్లకే ఎక్కువగా పట్టం కడుతున్నారు.
సినిమాలు సీరియస్గా ఉన్నప్పటికీ మాస్, కమర్షియల్ అంశాలు ఉంటే నడిచిపోతుంది కానీ.. పూర్తిగా సామాజిక అంశాలు, సందేశం మిళితమై నడిచే కథలు ఈ రోజుల్లో ఆడటం అరుదుగానే ఉంటోంది. దేవా తీసిన ‘ప్రస్థానం’ గొప్ప సినిమా అంటారు కానీ.. అది బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడని విషయం గమనార్హం. మరి ‘రిపబ్లిక్’ ఈ అంచనాల్ని దాటి ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ విజేతగా నిలిచి దేవా ఇలాంటి సినిమాలు మరిన్ని తీసేలా స్ఫూర్తినిస్తుందేమో చూడాలి.
This post was last modified on September 22, 2021 6:03 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…