టాలీవుడ్ స్టార్ హీరోల్లో లుక్స్ పరంగా పెద్దగా మార్పు చూపించని హీరోల్లో మహేష్ బాబు ఒకడు. మిగతా హీరోల్లా హేర్ స్టైల్ మార్చడం.. గడ్డం పెంచడం.. మీసకట్టులో మార్పు చూపించడం.. డ్రెస్సింగ్ విషయంలో కొత్తగా ఏదైనా ట్రై చేయడం మహేష్ విషయంలో తక్కువే. అందులోనూ గత కొన్నేళ్లలో అయితే అతడి లుక్ మరీ మొనాటనస్గా తయారైంది.
‘శ్రీమంతుడు’ దగ్గర్నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు దాదాపు ఒకే లుక్లో కనిపిస్తూ వచ్చాడు మహేష్. ‘సరిలేరు నీకెవ్వరు’తో కథ, క్యారెక్టర్ పరంగా కొంచెం ఊపు కనిపించినా.. మహేష్ లుక్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఈ విషయంలో మహేష్ అభిమానుల నుంచే కొంత నెగెటివ్ కామెంట్లు వినిపించాయి. అతణ్ని కొత్త అవతారంలో చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ ఛాన్స్ ‘సర్కారు వారి పాట’ ఇచ్చేట్లే కనిపిస్తోంది.
ఈ సినిమా టైటిల్, దీని ప్రి లుక్ చూస్తే మహేష్ బాబు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొంచెం కొత్తగా ఏదో ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తోంది. ‘పోకిరి’, ‘ఖలేజా’ తరహాలో మహేష్ క్యారెక్టర్, అతడి లుక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయన్నది చిత్ర వర్గాల మాట.
ప్రి లుక్లో మహేష్ జుట్టు పెంచి, చెవికి పోగు తగిలించి, కొంచెం గడ్డం కూడా పెంచి కనిపించబోతున్నట్లు స్పష్టమైంది. లుక్స్ పరంగా మాత్రం అతడికి ఈ సినిమా ఒక మేకోవర్ ఇవ్వబోతోందని స్పష్టమైంది.
పరశురామ్ ఇప్పటిదాకా ఎక్కువగా క్లాస్ సినిమాలే చేశాడు కానీ.. మహేష్ కోసం మాస్ టచ్ ఉంటూనే కొత్తగా సాగే కథ తయారు చేశాడట. తాను హీరో ఎలివేషన్ సీన్స్ రాయలేక కాదు అని.. ఇప్పటిదాకా అవకాశం రాలేదని.. మహేష్ సినిమాతో ఆ అవకాశం వచ్చిందని.. ఈ సినిమా అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ఉంటుందని.. మహేష్ కెరీర్లో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుందని పరశురామ్ అంటుండటంతో ఫ్యాన్స్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…