‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ డిమాండ్ ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే. తెలుగుతో పాటు కోలీవుడ్ లో అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె నటించిన కొన్ని సినిమా డిజాస్టర్ అయ్యాయి. దీంతో కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ నటిస్తోన్న కీర్తి మరోపక్క సిస్టర్ రోల్స్ లో కనిపించడానికి ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఇంత క్రేజ్ ఉండి, మంచి ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ఎవరూ కూడా అక్క, చెల్లెలు పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. కానీ కీర్తి సురేష్ మాత్రం అలాంటి నియమాలు పెట్టుకోవడం లేదు. ఏకంగా రెండు సినిమాల్లో సిస్టర్ గా కనిపించడానికి అంగీకరించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించనున్న ‘భోళా శంకర్’ సినిమాలో కీర్తి.. హీరో సిస్టర్ రోల్ ప్లే చేయనుంది. మొదట ఆ పాత్ర కోసం సాయిపల్లవిని అనుకున్నారు కానీ ఆమె నో చెప్పడంతో కీర్తి సురేష్ ను సంప్రదించారు.
దీనికోసం కీర్తికి దాదాపు రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాతో పాటు తమిళంలో మరో సినిమా ఒప్పుకుంది కీర్తి సురేష్. సెల్వరాఘవన్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఆయన చెల్లెలుగా నటించమని కీర్తిని అడగ్గా.. దానికి ఆమె అంగీకరించింది. తెలుగు, తమిళం రెండు భాషల్లో స్టార్ హీరోలతో నటించిన కీర్తి ఇప్పుడు సిస్టర్ రోల్స్ లో నటించడం హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on September 22, 2021 2:42 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…