శేఖర్ కమ్ముల కెరీర్లో ప్రత్యేకంగా కనిపించే చిత్రం.. లీడర్. ఎక్కువగా లైట్ హార్టెడ్ లవ్ స్టోరీలు, కాలేజ్, కాలనీ కథలు తీసిన తీసిన కమ్ముల.. ఈ సినిమాలో మాత్రం రాజకీయ వ్యవస్థ, అవినీతి చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాను చూపించాడు. ఇందులోనూ తన క్లాస్ చూపించినప్పటికీ కమ్ముల నుంచి ఇలాంటి సినిమాను ఆ టైంలో ఎవరూ ఊహించలేదు. ఐతే ‘లీడర్’ అప్పట్లో మరీ పెద్ద విజయం సాధించలేదు. అలాగని ఫెయిల్యూర్గానూ నిలవలేదు. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. కమ్ముల నుంచి ఇలాంటి సినిమా ఇంకోటి వస్తే బాగుండన్న అభిప్రాయం జనాల్లో ఉంది.
‘లీడర్’ సీక్వెల్ గురించి గతంలో చర్చ జరిగిన నేపథ్యంలో ఆ సినిమానే కమ్ముల నుంచి ఆశిస్తున్నారు కూడా. తన కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన శేఖర్.. ‘లీడర్-2’ కచ్చితంగా తీస్తానని ప్రకటించడం విశేషం.
‘లీడర్-2’ తీయడానికి తగ్గ ఆలోచనలు తన దగ్గర ఉన్నాయని.. ఈ సినిమా కచ్చితంగా తీస్తానని.. కానీ అందుకు టైం పడుతుందని కమ్ముల తెలిపాడు. ‘లీడర్’లో ఉన్న ముఖ్య పాత్రలన్నీ అందులోనూ ఉంటాయని, రానా కూడా నటిస్తాడని.. ఆ పాత్రలతోనే నడిచేలా ‘లీడర్-2’ తీస్తానని చెప్పాడు. ధనుష్తో తీయబోయే సినిమా థ్రిల్లర్ జానర్లో ఉంటుందని చెప్పిన కమ్ముల.. తన కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ కచ్చితంగా ఘనవిజయం సాధించడమే కాక, ప్రేక్షకుల్లో ఒక కదలిక తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఇందులో రెండు కీలక విషయాలపై చర్చ ఉంటుందని.. అందులో ఒకటి అబ్బాయి పట్ల ఉండే కులవివక్ష కాగా.. ఇంకోటి అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలపై సమాజం చూపించే వివక్ష అని అతనన్నాడు. ఐతే ఈ సమస్యలకు తాను పరిష్కారం చూపించేశానని అనుకోవట్లేదని.. కానీ తప్పుల్ని చెప్పడం అవసరమన్న ఉద్దేశంతో వాటిని సినిమాలో బలంగా చూపించినట్లు తెలిపాడు. తన గత చిత్రాల్లానే ‘లవ్ స్టోరి’ కూడా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుందన్నాడు.
This post was last modified on September 20, 2021 6:21 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…