శేఖర్ కమ్ముల కెరీర్లో ప్రత్యేకంగా కనిపించే చిత్రం.. లీడర్. ఎక్కువగా లైట్ హార్టెడ్ లవ్ స్టోరీలు, కాలేజ్, కాలనీ కథలు తీసిన తీసిన కమ్ముల.. ఈ సినిమాలో మాత్రం రాజకీయ వ్యవస్థ, అవినీతి చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాను చూపించాడు. ఇందులోనూ తన క్లాస్ చూపించినప్పటికీ కమ్ముల నుంచి ఇలాంటి సినిమాను ఆ టైంలో ఎవరూ ఊహించలేదు. ఐతే ‘లీడర్’ అప్పట్లో మరీ పెద్ద విజయం సాధించలేదు. అలాగని ఫెయిల్యూర్గానూ నిలవలేదు. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. కమ్ముల నుంచి ఇలాంటి సినిమా ఇంకోటి వస్తే బాగుండన్న అభిప్రాయం జనాల్లో ఉంది.
‘లీడర్’ సీక్వెల్ గురించి గతంలో చర్చ జరిగిన నేపథ్యంలో ఆ సినిమానే కమ్ముల నుంచి ఆశిస్తున్నారు కూడా. తన కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన శేఖర్.. ‘లీడర్-2’ కచ్చితంగా తీస్తానని ప్రకటించడం విశేషం.
‘లీడర్-2’ తీయడానికి తగ్గ ఆలోచనలు తన దగ్గర ఉన్నాయని.. ఈ సినిమా కచ్చితంగా తీస్తానని.. కానీ అందుకు టైం పడుతుందని కమ్ముల తెలిపాడు. ‘లీడర్’లో ఉన్న ముఖ్య పాత్రలన్నీ అందులోనూ ఉంటాయని, రానా కూడా నటిస్తాడని.. ఆ పాత్రలతోనే నడిచేలా ‘లీడర్-2’ తీస్తానని చెప్పాడు. ధనుష్తో తీయబోయే సినిమా థ్రిల్లర్ జానర్లో ఉంటుందని చెప్పిన కమ్ముల.. తన కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ కచ్చితంగా ఘనవిజయం సాధించడమే కాక, ప్రేక్షకుల్లో ఒక కదలిక తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఇందులో రెండు కీలక విషయాలపై చర్చ ఉంటుందని.. అందులో ఒకటి అబ్బాయి పట్ల ఉండే కులవివక్ష కాగా.. ఇంకోటి అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలపై సమాజం చూపించే వివక్ష అని అతనన్నాడు. ఐతే ఈ సమస్యలకు తాను పరిష్కారం చూపించేశానని అనుకోవట్లేదని.. కానీ తప్పుల్ని చెప్పడం అవసరమన్న ఉద్దేశంతో వాటిని సినిమాలో బలంగా చూపించినట్లు తెలిపాడు. తన గత చిత్రాల్లానే ‘లవ్ స్టోరి’ కూడా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుందన్నాడు.
This post was last modified on September 20, 2021 6:21 pm
మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది…
స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్ ఇస్తున్న…
సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…
అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…