మెగాస్టార్ చిరంజీవిని ఆరాధించే ఓ నటికి ఆయనతో ఒక సినిమా చేసే అవకాశం వస్తే వదులుకుంటుందా? ఆ సినిమా ఎలాంటిదైనా, పాత్ర ఏ తరహాదైనా నో చెబుతుందా? కానీ సాయిపల్లవి అవకాశం వదులుకుంది. చిరు సినిమాకు నో చెప్పింది. తమిళ హిట్ ‘వేదాళం’కు రీమేక్గా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో చిరు సోదరిగా కీలక పాత్రకు ముందు అడిగింది సాయిపల్లవినే. కానీ ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో కీర్తి సురేష్ను ఆ పాత్ర కోసం ఎంచుకున్నారు.
ఇన్నాళ్లూ ఇది మీడియాలో ఉన్న ప్రచారం మాత్రమే. కానీ ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కుదిరితే సాయిపల్లవికి జోడీగా డ్యాన్స్ వేయాలని కోరుకుంటానని.. తనకు చెల్లెలిగా ఆమె నటించకపోవడం మంచిదే అని చిరు చెప్పుకొచ్చారు. చిరు ఇలా అంటుంటే సాయిపల్లవికి చాలా ఇబ్బందిగా అనిపించింది.
నేను మీ సినిమాను కాదనడమా.. అంత మాట అనకండి అంటూ సాయిపల్లవి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. తనకు రీమేక్ సినిమాలంటే భయం అని.. అందుకే ఈ సినిమా ఒప్పుకోలేదని సాయిపల్లవి వివరణ ఇచ్చింది. ఒక కథానాయికకు రీమేక్ల విషయంలో ఎంత అయిష్టత ఉన్నప్పటికీ.. చిరంజీవి సినిమా అంటే ఆ రూల్ పక్కన పెట్టి మరీ నటిస్తుంది. హీరోల్లో మహేష్ బాబు కూడా రీమేక్స్లో నటించకూడదని కెరీర్ ఆరంభంలోనే నిర్ణయం తీసుకున్నాడు. దానికి కట్టుబడే ఉన్నాడు. కానీ హీరోయిన్లకు ఇంత లగ్జరీ ఉండదు. వాళ్లకంత ఛాయిస్ ఉండటం అరుదే. కానీ సాయిపల్లవి ఈ విషయంలో చాలా దృఢంగానే నిలబడుతోంది.
చిరు చిత్రమే కాదు.. పవన్కు జోడీగా ‘భీమ్లా నాయక్’లో నటించే అవకాశం వచ్చినా ఆమె వదులుకుంది. అది కూడా రీమేకే అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్ల సినిమాలే కాదన్నదంటే రీమేక్ల విషయంలో ఆమె ఎంత బలంగా ఫిక్సయిందో అర్థం చేసుకోవచ్చు. సాయిపల్లవి ఎంత అరుదైన హీరోయినో చెప్పడానికి ఇది రుజువు.
This post was last modified on September 20, 2021 3:40 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…