పెర్ఫెక్షన్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి అసలు రాజీ పడరు. అందుకే ఆయన ఒక్క సినిమా పూర్తి చేయడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటూ ఉంటారు. భారీ బడ్జెట్ తో తీసిన సన్నివేశాలు కూడా ఆయనకు నచ్చకపోతే మళ్లీ రీషూట్ చేస్తారే కానీ ఔట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కానీ రాజమౌళి పెర్ఫెక్షన్స్ పేరుతో తనకు నచ్చని సన్నివేశాలన్నీ రీషూట్ చేస్తున్నారు.
రీసెంట్ గా రషెస్ చూసుకున్న రాజమౌళికి సినిమాలో ఎన్టీఆర్-ఒలీవియా మోరిస్ ల మధ్య సన్నివేశాలు సంతృప్తిగా అనిపించలేదట. వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఆశించిన స్థాయిలో రాలేదని ఫీలైన రాజమౌళి.. ఇప్పుడు ఆ లవ్ ట్రాక్ ను మళ్లీ రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ దొరసానితో మన్యం దొర ప్రేమకథ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను మరింత పెంచేసింది.
నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మొన్నామధ్య దసరా కానుకగా విడుదల చేస్తామని చెప్పి.. ప్రమోషన్స్ హడావిడి కూడా చేశారు. కానీ మళ్లీ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి షాకిచ్చింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఇప్పుడు సంక్రాంతి బరిలో విడుదలవుతుందని కొందరు.. వేసవికి రిలీజ్ అవుతుందని మరికొందరు అంటున్నారు. మరి రాజమౌళి ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో..!
This post was last modified on September 18, 2021 8:49 am
సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ…
ఈ రోజు మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది కొరియన్ కనకరాజు సినిమా. వరుణ్ తేేజ్ హీరోగా మేర్లపాక…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు వ్యవహారం ఎన్నికలకు ముందు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
వచ్చే వారం ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథం అండ్ సన్స్ మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్…
వరుణ్ తేజ్ గత సినిమాల ఓపెనింగ్స్ ఒకసారి తవ్వి తీస్తే రిలీజ్ రోజు మార్నింగ్ షోకు చాలా చోట్ల ఫుల్స్…
న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…