Movie News

‘ఆర్ఆర్ఆర్’.. ఎన్టీఆర్ లవ్ స్టోరీ రీషూట్!

పెర్ఫెక్షన్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి అసలు రాజీ పడరు. అందుకే ఆయన ఒక్క సినిమా పూర్తి చేయడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటూ ఉంటారు. భారీ బడ్జెట్ తో తీసిన సన్నివేశాలు కూడా ఆయనకు నచ్చకపోతే మళ్లీ రీషూట్ చేస్తారే కానీ ఔట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కానీ రాజమౌళి పెర్ఫెక్షన్స్ పేరుతో తనకు నచ్చని సన్నివేశాలన్నీ రీషూట్ చేస్తున్నారు.

రీసెంట్ గా రషెస్ చూసుకున్న రాజమౌళికి సినిమాలో ఎన్టీఆర్-ఒలీవియా మోరిస్ ల మధ్య సన్నివేశాలు సంతృప్తిగా అనిపించలేదట. వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఆశించిన స్థాయిలో రాలేదని ఫీలైన రాజమౌళి.. ఇప్పుడు ఆ లవ్ ట్రాక్ ను మళ్లీ రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ దొరసానితో మన్యం దొర ప్రేమకథ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను మరింత పెంచేసింది.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మొన్నామధ్య దసరా కానుకగా విడుదల చేస్తామని చెప్పి.. ప్రమోషన్స్ హడావిడి కూడా చేశారు. కానీ మళ్లీ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి షాకిచ్చింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఇప్పుడు సంక్రాంతి బరిలో విడుదలవుతుందని కొందరు.. వేసవికి రిలీజ్ అవుతుందని మరికొందరు అంటున్నారు. మరి రాజమౌళి ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో..!

This post was last modified on September 18, 2021 8:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

47 minutes ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

1 hour ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

2 hours ago

మీ తీరు మార‌దా?: ‘ఈడీ’పై తొలిసారి సుప్రీంకోర్టు ఆగ్ర‌హం!

కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు చేస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.…

3 hours ago

‘విష’ ప్ర‌చారానికి ప‌నితీరే విరుగుడు బాబు గారూ..!

కూట‌మి ప్ర‌భుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప్ర‌భుత్వం ఏం చేసిందన్న విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే..…

3 hours ago

ఖాతాలు అప్ డేట్ చేసుకోండి.. ఏపీ స‌ర్కారు ఎనౌన్స్‌మెంట్

"మీ మీ బ్యాంకు ఖాతాల‌ను మ‌రోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని అన్న దాత‌ల‌కు సూచించింది.…

3 hours ago