పెర్ఫెక్షన్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి అసలు రాజీ పడరు. అందుకే ఆయన ఒక్క సినిమా పూర్తి చేయడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటూ ఉంటారు. భారీ బడ్జెట్ తో తీసిన సన్నివేశాలు కూడా ఆయనకు నచ్చకపోతే మళ్లీ రీషూట్ చేస్తారే కానీ ఔట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కానీ రాజమౌళి పెర్ఫెక్షన్స్ పేరుతో తనకు నచ్చని సన్నివేశాలన్నీ రీషూట్ చేస్తున్నారు.
రీసెంట్ గా రషెస్ చూసుకున్న రాజమౌళికి సినిమాలో ఎన్టీఆర్-ఒలీవియా మోరిస్ ల మధ్య సన్నివేశాలు సంతృప్తిగా అనిపించలేదట. వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఆశించిన స్థాయిలో రాలేదని ఫీలైన రాజమౌళి.. ఇప్పుడు ఆ లవ్ ట్రాక్ ను మళ్లీ రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ దొరసానితో మన్యం దొర ప్రేమకథ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను మరింత పెంచేసింది.
నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మొన్నామధ్య దసరా కానుకగా విడుదల చేస్తామని చెప్పి.. ప్రమోషన్స్ హడావిడి కూడా చేశారు. కానీ మళ్లీ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి షాకిచ్చింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఇప్పుడు సంక్రాంతి బరిలో విడుదలవుతుందని కొందరు.. వేసవికి రిలీజ్ అవుతుందని మరికొందరు అంటున్నారు. మరి రాజమౌళి ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో..!
This post was last modified on September 18, 2021 8:49 am
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…