పెర్ఫెక్షన్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి అసలు రాజీ పడరు. అందుకే ఆయన ఒక్క సినిమా పూర్తి చేయడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటూ ఉంటారు. భారీ బడ్జెట్ తో తీసిన సన్నివేశాలు కూడా ఆయనకు నచ్చకపోతే మళ్లీ రీషూట్ చేస్తారే కానీ ఔట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కానీ రాజమౌళి పెర్ఫెక్షన్స్ పేరుతో తనకు నచ్చని సన్నివేశాలన్నీ రీషూట్ చేస్తున్నారు.
రీసెంట్ గా రషెస్ చూసుకున్న రాజమౌళికి సినిమాలో ఎన్టీఆర్-ఒలీవియా మోరిస్ ల మధ్య సన్నివేశాలు సంతృప్తిగా అనిపించలేదట. వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఆశించిన స్థాయిలో రాలేదని ఫీలైన రాజమౌళి.. ఇప్పుడు ఆ లవ్ ట్రాక్ ను మళ్లీ రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ దొరసానితో మన్యం దొర ప్రేమకథ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను మరింత పెంచేసింది.
నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మొన్నామధ్య దసరా కానుకగా విడుదల చేస్తామని చెప్పి.. ప్రమోషన్స్ హడావిడి కూడా చేశారు. కానీ మళ్లీ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి షాకిచ్చింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఇప్పుడు సంక్రాంతి బరిలో విడుదలవుతుందని కొందరు.. వేసవికి రిలీజ్ అవుతుందని మరికొందరు అంటున్నారు. మరి రాజమౌళి ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో..!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…