ఒకప్పుడు టాలీవుడ్ టాప్-4 హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకడు. మిగతా ముగ్గురు టాప్ స్టార్లయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో దీటుగా సినిమాలు చేసేవాడు. విజయాలూ అందుకునేవాడు. కానీ తర్వాతి తరం కథానాయకుల జోరు ముందు నాగ్ నిలవలేకపోయాడు.
అప్పుడప్పుడూ కొన్ని విజయాలందుకున్నప్పటికీ ఆయన క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ గత కొన్నేళ్లలో బాగా దెబ్బ తినేశాయి. ఇప్పుడు నాగ్ స్టార్ డమ్ అంతగా పని చేయట్లేదు. తన కొడుకులకు కూడా ఆయన అండ సరిపోవట్లేదు.
నాగ్ ఎంతగా ప్రయత్నించినా తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ను నాగ్ హీరోగా నిలబెట్టలేకపోయాడు. ఆయన ప్లాన్ చేసిన తొలి మూడు సినిమాలు పరాజయాల పాలయ్యాయి. అందులోనూ ఎంతో శ్రద్ధ పెట్టి, దగ్గరుండి తీయించిన హలో కూడా దెబ్బ కొట్టేసింది. దీంతో చివరికి నాగ్.. కొడుకు కోసం మెగా గడప తొక్కాడు. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో గీతా ఆర్ట్స్ బేనర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేయించాడు. గతంలో చైతూ స్ట్రగులవుతున్నపుడు కూడా ఇదే బేనర్లో 100 పర్సంట్ లవ్ చేయించడం తెలిసిందే.
అంతే కాదు.. తన సినిమాలకు, తన కొడుకుల సినిమాలకు నాగ్ ప్రమోషన్ పరంగా కూడా మెగా బ్రాండ్ వాడుతుండటం గమనార్హం. వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ ముంగిట ప్రచారం కోసం చిరంజీవి సపోర్ట్ తీసుకోవడం తెలిసిన విషయమే. ఇప్పుడు తన పెద్ద కొడుకు నాగచైతన్య కొత్త చిత్రం లవ్ స్టోరి రిలీజ్కు రెడీ అయిన నేపథ్యంలో జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్కు చిరును వెంటబెట్టుకుని వస్తున్నాడు నాగ్. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ చిరంజీవిని అతిథిగా రప్పించడం ఆశ్చర్యమే. ఇది చూసి అక్కినేని వారి మెగా వాడకం మామూలుగా లేదని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
This post was last modified on September 17, 2021 11:36 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…