ఒకప్పుడు టాలీవుడ్ టాప్-4 హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకడు. మిగతా ముగ్గురు టాప్ స్టార్లయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో దీటుగా సినిమాలు చేసేవాడు. విజయాలూ అందుకునేవాడు. కానీ తర్వాతి తరం కథానాయకుల జోరు ముందు నాగ్ నిలవలేకపోయాడు.
అప్పుడప్పుడూ కొన్ని విజయాలందుకున్నప్పటికీ ఆయన క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ గత కొన్నేళ్లలో బాగా దెబ్బ తినేశాయి. ఇప్పుడు నాగ్ స్టార్ డమ్ అంతగా పని చేయట్లేదు. తన కొడుకులకు కూడా ఆయన అండ సరిపోవట్లేదు.
నాగ్ ఎంతగా ప్రయత్నించినా తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ను నాగ్ హీరోగా నిలబెట్టలేకపోయాడు. ఆయన ప్లాన్ చేసిన తొలి మూడు సినిమాలు పరాజయాల పాలయ్యాయి. అందులోనూ ఎంతో శ్రద్ధ పెట్టి, దగ్గరుండి తీయించిన హలో కూడా దెబ్బ కొట్టేసింది. దీంతో చివరికి నాగ్.. కొడుకు కోసం మెగా గడప తొక్కాడు. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో గీతా ఆర్ట్స్ బేనర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేయించాడు. గతంలో చైతూ స్ట్రగులవుతున్నపుడు కూడా ఇదే బేనర్లో 100 పర్సంట్ లవ్ చేయించడం తెలిసిందే.
అంతే కాదు.. తన సినిమాలకు, తన కొడుకుల సినిమాలకు నాగ్ ప్రమోషన్ పరంగా కూడా మెగా బ్రాండ్ వాడుతుండటం గమనార్హం. వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ ముంగిట ప్రచారం కోసం చిరంజీవి సపోర్ట్ తీసుకోవడం తెలిసిన విషయమే. ఇప్పుడు తన పెద్ద కొడుకు నాగచైతన్య కొత్త చిత్రం లవ్ స్టోరి రిలీజ్కు రెడీ అయిన నేపథ్యంలో జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్కు చిరును వెంటబెట్టుకుని వస్తున్నాడు నాగ్. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ చిరంజీవిని అతిథిగా రప్పించడం ఆశ్చర్యమే. ఇది చూసి అక్కినేని వారి మెగా వాడకం మామూలుగా లేదని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
This post was last modified on September 17, 2021 11:36 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…