కరోనా తగ్గుముఖం పట్టినా ఓటీటీ హవా ఏమీ తగ్గలేదు. థియేటర్లు పునఃప్రారంభమై పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పటికీ కొత్త సినిమాలు ఓటీటీ బాట పడుతూనే ఉన్నాయి. గత రెండు నెలల్లో నారప్ప, వివాహ భోజనంబు, నెట్, టక్ జగదీష్.. ఇలా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు ఓటీటీల ద్వారా రిలీజయ్యాయి. వీటిలో కొన్ని చిత్రాలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. థియేటర్లలో రిలీజైన సినిమాలను మించి అవి స్పందన తెచ్చుకున్నాయి.
వినాయక చవితి కానుకగా సీటీమార్, తలైవి చిత్రాలు థియేటర్లలో విడుదల కాగా.. అదే రోజు టక్ జగదీష్ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. సీటీమార్, తలైవి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా సరే.. వాటికి ఆశించిన వసూళ్లు రాలేదు. సీటీమార్ వీకెండ్ వరకు జోరు చూపించి ఆ తర్వాత చల్లబడిపోయింది. తలైవి అసలేమాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. అదే సమయంలో టక్ జగదీష్ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా అమేజాన్ ప్రైమ్లో తెలుగు సినిమాల వరకు రికార్డు స్థాయి వ్యూస్ తెచ్చుకుంది. కాగా ఈ వారం కూడా థియేటర్ వెర్సస్ ఓటీటీ ట్రెండ్ చూడబోతున్నాం.
సందీప్ కిషన్ మూవీ గల్లీ రౌడీ బిగ్ స్క్రీన్లలో రిలీజవుతుంటే.. నితిన్ మూవీ మాస్ట్రో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు విజయ్ సేతుపతి-తాప్సిల అనాబెల్ సేతుపతి మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ రెండు చిత్రాలనూ హాట్ స్టారే స్ట్రీమ్ చేయనుంది. ఈ మూడు చిత్రాల్లో ఎక్కువ క్రేజ్ కనిపిస్తున్నది మాస్ట్రోకే. గల్లీ రౌడీ కూడా ఓ మోస్తరుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐతే దేనికి ఎలాంటి టాక్ వస్తుందన్నది కీలకం. మంచి ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న గల్లీ రౌడీకి పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లలో సందడి కనిపించొచ్చు. మాస్ట్రో రీమేక్ మూవీ కాబట్టి మినిమం గ్యారెంటీ అనిపిస్తోంది. మరి అనాబెల్ సేతుపతికి అంతగా బజ్ లేదు. మరి ఈ వారం అయినా ఓటీటీ మీద థియేటర్ పైచేయి సాధిస్తుందా.. లేక గత వారం ట్రెండే కొనసాగుతుందా అన్నది చూడాలి.
This post was last modified on September 16, 2021 7:25 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…