కరోనా తగ్గుముఖం పట్టినా ఓటీటీ హవా ఏమీ తగ్గలేదు. థియేటర్లు పునఃప్రారంభమై పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పటికీ కొత్త సినిమాలు ఓటీటీ బాట పడుతూనే ఉన్నాయి. గత రెండు నెలల్లో నారప్ప, వివాహ భోజనంబు, నెట్, టక్ జగదీష్.. ఇలా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు ఓటీటీల ద్వారా రిలీజయ్యాయి. వీటిలో కొన్ని చిత్రాలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. థియేటర్లలో రిలీజైన సినిమాలను మించి అవి స్పందన తెచ్చుకున్నాయి.
వినాయక చవితి కానుకగా సీటీమార్, తలైవి చిత్రాలు థియేటర్లలో విడుదల కాగా.. అదే రోజు టక్ జగదీష్ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. సీటీమార్, తలైవి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా సరే.. వాటికి ఆశించిన వసూళ్లు రాలేదు. సీటీమార్ వీకెండ్ వరకు జోరు చూపించి ఆ తర్వాత చల్లబడిపోయింది. తలైవి అసలేమాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. అదే సమయంలో టక్ జగదీష్ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా అమేజాన్ ప్రైమ్లో తెలుగు సినిమాల వరకు రికార్డు స్థాయి వ్యూస్ తెచ్చుకుంది. కాగా ఈ వారం కూడా థియేటర్ వెర్సస్ ఓటీటీ ట్రెండ్ చూడబోతున్నాం.
సందీప్ కిషన్ మూవీ గల్లీ రౌడీ బిగ్ స్క్రీన్లలో రిలీజవుతుంటే.. నితిన్ మూవీ మాస్ట్రో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు విజయ్ సేతుపతి-తాప్సిల అనాబెల్ సేతుపతి మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ రెండు చిత్రాలనూ హాట్ స్టారే స్ట్రీమ్ చేయనుంది. ఈ మూడు చిత్రాల్లో ఎక్కువ క్రేజ్ కనిపిస్తున్నది మాస్ట్రోకే. గల్లీ రౌడీ కూడా ఓ మోస్తరుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐతే దేనికి ఎలాంటి టాక్ వస్తుందన్నది కీలకం. మంచి ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న గల్లీ రౌడీకి పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లలో సందడి కనిపించొచ్చు. మాస్ట్రో రీమేక్ మూవీ కాబట్టి మినిమం గ్యారెంటీ అనిపిస్తోంది. మరి అనాబెల్ సేతుపతికి అంతగా బజ్ లేదు. మరి ఈ వారం అయినా ఓటీటీ మీద థియేటర్ పైచేయి సాధిస్తుందా.. లేక గత వారం ట్రెండే కొనసాగుతుందా అన్నది చూడాలి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…