కరోనా తగ్గుముఖం పట్టినా ఓటీటీ హవా ఏమీ తగ్గలేదు. థియేటర్లు పునఃప్రారంభమై పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పటికీ కొత్త సినిమాలు ఓటీటీ బాట పడుతూనే ఉన్నాయి. గత రెండు నెలల్లో నారప్ప, వివాహ భోజనంబు, నెట్, టక్ జగదీష్.. ఇలా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు ఓటీటీల ద్వారా రిలీజయ్యాయి. వీటిలో కొన్ని చిత్రాలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. థియేటర్లలో రిలీజైన సినిమాలను మించి అవి స్పందన తెచ్చుకున్నాయి.
వినాయక చవితి కానుకగా సీటీమార్, తలైవి చిత్రాలు థియేటర్లలో విడుదల కాగా.. అదే రోజు టక్ జగదీష్ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. సీటీమార్, తలైవి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా సరే.. వాటికి ఆశించిన వసూళ్లు రాలేదు. సీటీమార్ వీకెండ్ వరకు జోరు చూపించి ఆ తర్వాత చల్లబడిపోయింది. తలైవి అసలేమాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. అదే సమయంలో టక్ జగదీష్ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా అమేజాన్ ప్రైమ్లో తెలుగు సినిమాల వరకు రికార్డు స్థాయి వ్యూస్ తెచ్చుకుంది. కాగా ఈ వారం కూడా థియేటర్ వెర్సస్ ఓటీటీ ట్రెండ్ చూడబోతున్నాం.
సందీప్ కిషన్ మూవీ గల్లీ రౌడీ బిగ్ స్క్రీన్లలో రిలీజవుతుంటే.. నితిన్ మూవీ మాస్ట్రో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు విజయ్ సేతుపతి-తాప్సిల అనాబెల్ సేతుపతి మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ రెండు చిత్రాలనూ హాట్ స్టారే స్ట్రీమ్ చేయనుంది. ఈ మూడు చిత్రాల్లో ఎక్కువ క్రేజ్ కనిపిస్తున్నది మాస్ట్రోకే. గల్లీ రౌడీ కూడా ఓ మోస్తరుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐతే దేనికి ఎలాంటి టాక్ వస్తుందన్నది కీలకం. మంచి ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న గల్లీ రౌడీకి పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లలో సందడి కనిపించొచ్చు. మాస్ట్రో రీమేక్ మూవీ కాబట్టి మినిమం గ్యారెంటీ అనిపిస్తోంది. మరి అనాబెల్ సేతుపతికి అంతగా బజ్ లేదు. మరి ఈ వారం అయినా ఓటీటీ మీద థియేటర్ పైచేయి సాధిస్తుందా.. లేక గత వారం ట్రెండే కొనసాగుతుందా అన్నది చూడాలి.
This post was last modified on September 16, 2021 7:25 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…