స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నారు దిల్ రాజు. దీనికి ‘ఐకాన్’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. నిజానికి ‘పుష్ప’ కంటే ముందుగా ‘ఐకాన్’ సినిమాను పట్టాలెక్కిస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాడు బన్నీ.
సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాదిన కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ రేంజ్ పెరగడం ఖాయం. అందుకే తన తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు బన్నీ. ఈ క్రమంలో ‘ఐకాన్’ సినిమాను పాన్ ఇండియా సబ్జెక్ట్ గా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు.
నిజానికి ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు దర్శకుడు కొందరు నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. వారంతా కూడా తెలుగు ఆర్టిస్టులే. ఇప్పుడు వాళ్లందరినీ తీసేసి పాన్ ఇండియా యాక్టర్స్ ను రంగంలోకి దింపాలని బన్నీ హుకూం జారీ చేశాడట. దీంతో దర్శకుడు ఫస్ట్ అనుకున్న క్యాస్ట్ మొత్తాన్ని మార్చేసే పనిలో పడ్డారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పేరున్న తారలను ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే, కృతిశెట్టిలను తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి వీటిపై చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి!
This post was last modified on September 15, 2021 6:07 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…