సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఆయన తండ్రి కృష్ణ పుట్టిన రోజు ఆదివారమే కాగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త సినిమా ప్రకటన చేస్తాడా.. లేక ముహూర్త కార్యక్రమం నిర్వహిస్తారా అన్నది తెలియక టెన్షన్ పడిపోతున్నారు. ఈసారి కృష్ణ ఎలాంటి వేడుకలూ చేయొద్దని అభిమానులకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. పరశురామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా అనౌన్స్మెంట్ను మహేష్ రద్దు చేసుకున్నట్లు గుసగుసలు వినిపించాయి.
తర్వాత సింపుల్గా ముహూర్త కార్యక్రమం మాత్రం నిర్వహిస్తారని అన్నారు. ఈ సినిమాకు ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ప్రచారంలోకి రావడం.. దీనిపై మహేష్ సీరియస్ అయినట్లు వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోఆదివారం మహేష్ కొత్త సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఐతే దీని సంగతేమో కానీ.. కృష్ణ పుట్టిన రోజు నాడు మహేష్తో మాట్లాడే అవకాశం అభిమానులకు దక్కనుంది. రేపు సాయంత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించబోతున్నాడు మహేష్. షూట్ యువర్ క్వశ్చన్స్ అంటూ అభిమానులకు అతను పిలుపునివ్వబోతున్నాడు. ఇందులో ప్రధానంగా మహేష్ కొత్త సినిమా, ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించే చర్చ ఉంటుందనడంలో సందేహం లేదు.
ముందుగా పరశురామ్ సినిమా గురించి మహేష్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమా టైటిల్ గురించి కూడా అభిమానులు అడుగుతారు. పరశురామ్ సినిమా తర్వాత ఏంది ఉంటుంది.. వంశీ పైడిపల్లితో ఇక పని చేయరా.. త్రివిక్రమ్తో మళ్లీ ఎప్పుడు జట్టు కడతారు.. రాజమౌళి సినిమా ఎప్పుడు.. అది ఏ జానర్లో ఉంటుంది.. ఇంకా ఎవరెవరితో పని చేయబోతున్నారు.. పాన్ ఇండియా సినిమాల సంగతేంటి లాంటి ప్రశ్నలు మహేష్కు ఎదురవుతాయి. వాటికి అతనేం బదులిస్తాడో చూడాలి.
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…