సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఆయన తండ్రి కృష్ణ పుట్టిన రోజు ఆదివారమే కాగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త సినిమా ప్రకటన చేస్తాడా.. లేక ముహూర్త కార్యక్రమం నిర్వహిస్తారా అన్నది తెలియక టెన్షన్ పడిపోతున్నారు. ఈసారి కృష్ణ ఎలాంటి వేడుకలూ చేయొద్దని అభిమానులకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. పరశురామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా అనౌన్స్మెంట్ను మహేష్ రద్దు చేసుకున్నట్లు గుసగుసలు వినిపించాయి.
తర్వాత సింపుల్గా ముహూర్త కార్యక్రమం మాత్రం నిర్వహిస్తారని అన్నారు. ఈ సినిమాకు ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ప్రచారంలోకి రావడం.. దీనిపై మహేష్ సీరియస్ అయినట్లు వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోఆదివారం మహేష్ కొత్త సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఐతే దీని సంగతేమో కానీ.. కృష్ణ పుట్టిన రోజు నాడు మహేష్తో మాట్లాడే అవకాశం అభిమానులకు దక్కనుంది. రేపు సాయంత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించబోతున్నాడు మహేష్. షూట్ యువర్ క్వశ్చన్స్ అంటూ అభిమానులకు అతను పిలుపునివ్వబోతున్నాడు. ఇందులో ప్రధానంగా మహేష్ కొత్త సినిమా, ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించే చర్చ ఉంటుందనడంలో సందేహం లేదు.
ముందుగా పరశురామ్ సినిమా గురించి మహేష్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమా టైటిల్ గురించి కూడా అభిమానులు అడుగుతారు. పరశురామ్ సినిమా తర్వాత ఏంది ఉంటుంది.. వంశీ పైడిపల్లితో ఇక పని చేయరా.. త్రివిక్రమ్తో మళ్లీ ఎప్పుడు జట్టు కడతారు.. రాజమౌళి సినిమా ఎప్పుడు.. అది ఏ జానర్లో ఉంటుంది.. ఇంకా ఎవరెవరితో పని చేయబోతున్నారు.. పాన్ ఇండియా సినిమాల సంగతేంటి లాంటి ప్రశ్నలు మహేష్కు ఎదురవుతాయి. వాటికి అతనేం బదులిస్తాడో చూడాలి.
This post was last modified on May 30, 2020 3:29 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…