కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అక్కడున్న యంగ్ హీరోల్లో ధనుష్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో టాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. ముందుగా దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నారాయణ్ దాస్ కె నారంగ్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దీని తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు ధనుష్.
ఈ రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టబోతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థలుగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లు ధనుష్ తో సినిమాలు చేయబోతున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో చేయబోయే సినిమాకి దర్శకుడిగా అజయ్ భూపతిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
మరోపక్క డీవీవీ దానయ్య.. ధనుష్ కోసం దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. సరైన కథ సెట్ అయితే ధనుష్ తో సినిమా మొదలుపెట్టడం ఖాయం. ఇప్పటికే ధనుష్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి ధనుష్ టాలీవుడ్ లో నాలుగు సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాలతో ఇక్కడ స్టార్ హీరోలకు పోటీగా మారతాడేమో చూడాలి!
This post was last modified on September 13, 2021 3:21 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…