కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అక్కడున్న యంగ్ హీరోల్లో ధనుష్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో టాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. ముందుగా దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నారాయణ్ దాస్ కె నారంగ్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దీని తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు ధనుష్.
ఈ రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టబోతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థలుగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లు ధనుష్ తో సినిమాలు చేయబోతున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో చేయబోయే సినిమాకి దర్శకుడిగా అజయ్ భూపతిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
మరోపక్క డీవీవీ దానయ్య.. ధనుష్ కోసం దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. సరైన కథ సెట్ అయితే ధనుష్ తో సినిమా మొదలుపెట్టడం ఖాయం. ఇప్పటికే ధనుష్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి ధనుష్ టాలీవుడ్ లో నాలుగు సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాలతో ఇక్కడ స్టార్ హీరోలకు పోటీగా మారతాడేమో చూడాలి!
This post was last modified on September 13, 2021 3:21 pm
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి…