‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివతో చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది. నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు కథ కూడా ఓకే అవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనే విషయంపై చిత్రబృందంలో కొందరు స్పందిస్తున్నారు.
ఎన్టీఆర్ కి ఇప్పటికే కొరటాల శివ స్టోరీ లైన్ చెప్పారని.. పూర్తి స్క్రిప్ట్ మాత్రం పూర్తి కాలేదని అంటున్నారు. ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉండడం వలన రాయలేదని.. కథలో మార్పులు అంటూ ఏవీ లేదని చెబుతున్నారు. ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయలేదని.. స్క్రిప్ట్ పూర్తయితేనే కదా మార్పులు చేర్పులు చేసేదని చెబుతోంది కొరటాల శివ టీమ్. ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన చివరి భాగం షూటింగ్ పూర్తయిన కొంత సమయం తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ మరోసారి స్క్రిప్ట్ గురించి పూర్తిస్థాయిలో చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను ఎంపిక చేసుకోగా.. రత్నవేలుని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య, నటుడు కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
This post was last modified on September 12, 2021 9:47 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…