‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివతో చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది. నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు కథ కూడా ఓకే అవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనే విషయంపై చిత్రబృందంలో కొందరు స్పందిస్తున్నారు.
ఎన్టీఆర్ కి ఇప్పటికే కొరటాల శివ స్టోరీ లైన్ చెప్పారని.. పూర్తి స్క్రిప్ట్ మాత్రం పూర్తి కాలేదని అంటున్నారు. ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉండడం వలన రాయలేదని.. కథలో మార్పులు అంటూ ఏవీ లేదని చెబుతున్నారు. ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయలేదని.. స్క్రిప్ట్ పూర్తయితేనే కదా మార్పులు చేర్పులు చేసేదని చెబుతోంది కొరటాల శివ టీమ్. ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన చివరి భాగం షూటింగ్ పూర్తయిన కొంత సమయం తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ మరోసారి స్క్రిప్ట్ గురించి పూర్తిస్థాయిలో చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను ఎంపిక చేసుకోగా.. రత్నవేలుని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య, నటుడు కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
This post was last modified on September 12, 2021 9:47 pm
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…