‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివతో చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది. నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు కథ కూడా ఓకే అవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనే విషయంపై చిత్రబృందంలో కొందరు స్పందిస్తున్నారు.
ఎన్టీఆర్ కి ఇప్పటికే కొరటాల శివ స్టోరీ లైన్ చెప్పారని.. పూర్తి స్క్రిప్ట్ మాత్రం పూర్తి కాలేదని అంటున్నారు. ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉండడం వలన రాయలేదని.. కథలో మార్పులు అంటూ ఏవీ లేదని చెబుతున్నారు. ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయలేదని.. స్క్రిప్ట్ పూర్తయితేనే కదా మార్పులు చేర్పులు చేసేదని చెబుతోంది కొరటాల శివ టీమ్. ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన చివరి భాగం షూటింగ్ పూర్తయిన కొంత సమయం తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ మరోసారి స్క్రిప్ట్ గురించి పూర్తిస్థాయిలో చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను ఎంపిక చేసుకోగా.. రత్నవేలుని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య, నటుడు కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…
నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు…
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…