ఈనాడు పత్రిక ఆరంభమై జనాదరణ పొందిన తొలి నాళ్ల నుంచి ఆ పత్రికలో కార్టూనిస్ట్గా ఉంటూ.. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న వ్యక్తి శ్రీధర్. ఈనాడును, శ్రీధర్ను ఎవ్వరూ కూడా వేరు చేసి చూడలేనంతగా ఆ పత్రికతో ఆయనకు అనుబంధం ఉంది. కొన్నేళ్ల కిందటే రిటైర్మెంట్ వయసు దాటేసినప్పటికీ.. ఎక్స్టెన్షన్ మీద ఆయన ఈనాడు కార్టూనిస్ట్గా కొనసాగుతూ వచ్చారు.
ఐతే ఇటీవల హఠాత్తుగా తాను ఈనాడు నుంచి బయటికొచ్చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశారు శ్రీధర్. ఇక అప్పట్నుంచి ఈనాడులో కార్టూన్ అన్నదే కనిపించడం లేదు. ఈనాడు యాజమాన్యంతో అభిప్రాయ భేదాలని, ఆయనకు కొందరు పెద్దలు పొమ్మనకుండా పొగబెట్టారని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆరోగ్యం సహకరించక ఆయన ఈనాడుకు గుడ్బై చెప్పారని కూడా కొందరన్నారు.
ఐతే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాలను శ్రీధర్ ఖండించారు కానీ.. తాను ఎందుకు ఈనాడు నుంచి వైదొలిగింది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే ఇక శ్రీధర్ విశ్రాంతి తీసుకుంటారా.. లేక వేరే మీడియా సంస్థలో చేరతారా అన్న దానిపై అమితాసక్తి నెలకొంది. ఈ విషయంలో శ్రీధర్ క్లారిటీ ఇచ్చారు. అంతరార్థం పేరుతో తాను యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టనున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. సమకాలీన రాజకీయాలపై ప్రతివారం ఇందులో విశ్లేషణ చేస్తానని ఆయన వెల్లడించారు.
ఐతే ఇది ఆదాయం కంటే కూడా ఒక వ్యాపకం లాగా చేయడానికి శ్రీధర్ నిర్ణయించుకున్నారని.. జనాలతో టచ్లో ఉండటానికి ఆయన ఎంచుకున్న మార్గం ఇదని.. వృత్తిగతంగా అయితే ఆయన రిటైరైనట్లే అని శ్రీధర్ సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ కార్యక్రమంలో శ్రీధర్ కార్టూన్లకు కూడా స్థానం ఉంటుందని, కోట్లాది తన అభిమానులను ఆయన అలరిస్తారని ఆశిద్దాం.
This post was last modified on September 12, 2021 5:39 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…