ఈనాడు పత్రిక ఆరంభమై జనాదరణ పొందిన తొలి నాళ్ల నుంచి ఆ పత్రికలో కార్టూనిస్ట్గా ఉంటూ.. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న వ్యక్తి శ్రీధర్. ఈనాడును, శ్రీధర్ను ఎవ్వరూ కూడా వేరు చేసి చూడలేనంతగా ఆ పత్రికతో ఆయనకు అనుబంధం ఉంది. కొన్నేళ్ల కిందటే రిటైర్మెంట్ వయసు దాటేసినప్పటికీ.. ఎక్స్టెన్షన్ మీద ఆయన ఈనాడు కార్టూనిస్ట్గా కొనసాగుతూ వచ్చారు.
ఐతే ఇటీవల హఠాత్తుగా తాను ఈనాడు నుంచి బయటికొచ్చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశారు శ్రీధర్. ఇక అప్పట్నుంచి ఈనాడులో కార్టూన్ అన్నదే కనిపించడం లేదు. ఈనాడు యాజమాన్యంతో అభిప్రాయ భేదాలని, ఆయనకు కొందరు పెద్దలు పొమ్మనకుండా పొగబెట్టారని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆరోగ్యం సహకరించక ఆయన ఈనాడుకు గుడ్బై చెప్పారని కూడా కొందరన్నారు.
ఐతే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాలను శ్రీధర్ ఖండించారు కానీ.. తాను ఎందుకు ఈనాడు నుంచి వైదొలిగింది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే ఇక శ్రీధర్ విశ్రాంతి తీసుకుంటారా.. లేక వేరే మీడియా సంస్థలో చేరతారా అన్న దానిపై అమితాసక్తి నెలకొంది. ఈ విషయంలో శ్రీధర్ క్లారిటీ ఇచ్చారు. అంతరార్థం పేరుతో తాను యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టనున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. సమకాలీన రాజకీయాలపై ప్రతివారం ఇందులో విశ్లేషణ చేస్తానని ఆయన వెల్లడించారు.
ఐతే ఇది ఆదాయం కంటే కూడా ఒక వ్యాపకం లాగా చేయడానికి శ్రీధర్ నిర్ణయించుకున్నారని.. జనాలతో టచ్లో ఉండటానికి ఆయన ఎంచుకున్న మార్గం ఇదని.. వృత్తిగతంగా అయితే ఆయన రిటైరైనట్లే అని శ్రీధర్ సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ కార్యక్రమంలో శ్రీధర్ కార్టూన్లకు కూడా స్థానం ఉంటుందని, కోట్లాది తన అభిమానులను ఆయన అలరిస్తారని ఆశిద్దాం.
This post was last modified on September 12, 2021 5:39 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…