హీరోగా అరంగేట్రంలో చేదు అనుభవం ఎదుర్కొని.. ఆపై అనూహ్యంగా విలన్ పాత్రల్లోకి మారి.. నెగెటివ్ రోల్స్లోనే మంచి గుర్తింపు సంపాదించుకుని.. తిరిగి హీరోగా మారి విజయాలందుకున్న నటుడు గోపీచంద్. అతడికి మాస్లో మంచి ఫాలోయింగే ఉంది. గోపీ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు భారీగానే ఉంటాయి.
ఐతే ఎలాంటి స్టార్కైనా అడపాదడపా విజయాలు అవసరం. వరుసగా ఫ్లాపులు వస్తే ఎంత స్టార్ అయినా తట్టుకోవడం కష్టమే. గోపీచంద్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. అతను హిట్టు కొట్టి ఏడేళ్లు దాటిపోయింది. శ్రీవాస్ దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘లౌక్యం’ తర్వాత అతడికి సక్సెస్ అన్నదే లేదు.
ఎన్నో అంచనాలు పెట్టుకున్న గౌతమ్ నంద, పంతం లాంటి సినిమాలు అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘సీటీమార్’పై గోపీచంద్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రంపై అతను ధీమాగా కూడా ఉన్నాడు.
వినాయక చవితి కానుకగా ఈ శుక్రవారం రిలీజైన ‘సీటీమార్’ టార్గెటెడ్ ఆడియన్స్ను బాగానే ఆకట్టుకుంటోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ.. మాస్ను మెప్పించే అంశాలకు లోటు లేని చిత్రమిది. కమర్షియల్ మీటర్లో ఎక్కడా ఏదీ తగ్గకుండా చూసుకున్నాడు దర్శకుడు సంపత్ నంది.
‘గౌతమ్ నంద’లో మిస్సయిన మాస్ అంశాలు ఇందులో ఉన్నాయి. గోపీచంద్ నుంచి తన అభిమానులు ఆశించే యాక్షన్ డోస్ బాగానే ఉండటం.. తమన్నా గ్లామర్ కూడా బాగానే ప్లస్ కావడం.. కొంతమేర సెంటిమెంట్ కూడా వర్కవుట్ కావడంతో సినిమా పైసా వసూల్ అనిపిస్తోంది. కరోనా ధాటికి దారుణంగా దెబ్బ తిన్న సింగిల్ స్క్రీన్లకు ఈ చిత్రం ఊపిరి పోస్తోంది.
కొవిడ్ సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ఇండియాలోనే ఇది హైయెస్ట్ గ్రాసర్గా నిలవడం విశేషం. శని, ఆదివారాల్లోనూ మంచి వసూళ్లే వస్తాయిని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇన్నాళ్లు వేచి చూసి థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినందుకు మంచి ఫలితమే దక్కేలా ఉంది. హిట్టు కోసం ఏడేళ్లుగా సాగుతున్న గోపీ నిరీక్షణ ఫలించేలాగే కనిపిస్తోంది.
This post was last modified on September 12, 2021 1:31 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…