హీరోగా అరంగేట్రంలో చేదు అనుభవం ఎదుర్కొని.. ఆపై అనూహ్యంగా విలన్ పాత్రల్లోకి మారి.. నెగెటివ్ రోల్స్లోనే మంచి గుర్తింపు సంపాదించుకుని.. తిరిగి హీరోగా మారి విజయాలందుకున్న నటుడు గోపీచంద్. అతడికి మాస్లో మంచి ఫాలోయింగే ఉంది. గోపీ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు భారీగానే ఉంటాయి.
ఐతే ఎలాంటి స్టార్కైనా అడపాదడపా విజయాలు అవసరం. వరుసగా ఫ్లాపులు వస్తే ఎంత స్టార్ అయినా తట్టుకోవడం కష్టమే. గోపీచంద్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. అతను హిట్టు కొట్టి ఏడేళ్లు దాటిపోయింది. శ్రీవాస్ దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘లౌక్యం’ తర్వాత అతడికి సక్సెస్ అన్నదే లేదు.
ఎన్నో అంచనాలు పెట్టుకున్న గౌతమ్ నంద, పంతం లాంటి సినిమాలు అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘సీటీమార్’పై గోపీచంద్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రంపై అతను ధీమాగా కూడా ఉన్నాడు.
వినాయక చవితి కానుకగా ఈ శుక్రవారం రిలీజైన ‘సీటీమార్’ టార్గెటెడ్ ఆడియన్స్ను బాగానే ఆకట్టుకుంటోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ.. మాస్ను మెప్పించే అంశాలకు లోటు లేని చిత్రమిది. కమర్షియల్ మీటర్లో ఎక్కడా ఏదీ తగ్గకుండా చూసుకున్నాడు దర్శకుడు సంపత్ నంది.
‘గౌతమ్ నంద’లో మిస్సయిన మాస్ అంశాలు ఇందులో ఉన్నాయి. గోపీచంద్ నుంచి తన అభిమానులు ఆశించే యాక్షన్ డోస్ బాగానే ఉండటం.. తమన్నా గ్లామర్ కూడా బాగానే ప్లస్ కావడం.. కొంతమేర సెంటిమెంట్ కూడా వర్కవుట్ కావడంతో సినిమా పైసా వసూల్ అనిపిస్తోంది. కరోనా ధాటికి దారుణంగా దెబ్బ తిన్న సింగిల్ స్క్రీన్లకు ఈ చిత్రం ఊపిరి పోస్తోంది.
కొవిడ్ సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ఇండియాలోనే ఇది హైయెస్ట్ గ్రాసర్గా నిలవడం విశేషం. శని, ఆదివారాల్లోనూ మంచి వసూళ్లే వస్తాయిని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇన్నాళ్లు వేచి చూసి థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినందుకు మంచి ఫలితమే దక్కేలా ఉంది. హిట్టు కోసం ఏడేళ్లుగా సాగుతున్న గోపీ నిరీక్షణ ఫలించేలాగే కనిపిస్తోంది.
This post was last modified on September 12, 2021 1:31 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…