Movie News

ప్రముఖ టీవీ నటుడు అనుమానాస్పద మృతి..!

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేష్ వలీయశాల(54) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది నటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్ధిక సమస్యలు, డిప్రెషన్ ఇలా పలు కారణాల వలన లైఫ్ లీడ్ చేయలేక సూసైడ్ ను ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. సుశాంత్ రాజ్ పుత్ మరణం తరువాత ఇండస్ట్రీలో ఇలాంటి చావు వార్తలు వింటూనే ఉన్నాం.

దాదాపు 22 ఏళ్లుగా సినీ పరిశ్రమలో పని చేస్తోన్న రమేష్ వలీయశాల శనివారం ఉదయం తిరువనంతపురంలోకి తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆయన మరణవార్తతో మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

కేరళ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్, సినిమాలు చేస్తూ నటుడిగా బిజీగా ఉండే రమేష్ ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే రమేష్ వలీయశాల షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారని.. ఇంతలో జీవచ్ఛవంలా కనిపించడంతో అతడి కుటుంబసభ్యులు, సహనటులు తట్టుకోలేకపోతున్నారు.

This post was last modified on September 11, 2021 5:20 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సంక్రాంతి కోసం నాగార్జున స్కెచ్

మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…

20 mins ago

సాయిపల్లవిని టార్గెట్ చేసుకుంటున్నారు

నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…

44 mins ago

సమంతా ఇంత మాస్ గా వుందేంటి

తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…

1 hour ago

రజని – కమల్ – చరణ్ ఒకే వేదికపై

కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…

2 hours ago

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

5 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

5 hours ago