కమర్షియల్ సినిమాల్లో మంచి మెసేజ్ లు ఉండేలా చూసుకుంటున్నారు మన హీరోలు. ఆ రకమైన కథలనే ఎన్నుకుంటున్నారు. ముఖ్యంగా కొరటాల శివ సినిమాల కాన్సెప్ట్స్ అన్నీ అలానే ఉంటాయి. మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ అనే సినిమా తీశాడు కొరటాల శివ. అప్పటినుండి మహేష్ తన ప్రతీ సినిమాలో ఏదో రూపంలో సందేశం ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాడు. ఆ పాయింట్ చుట్టూనే కథలు తిరుగుతున్నాయి. ఇప్పుడు మహేష్ నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కూడా ఇలాంటి పాయింట్స్ చాలానే ఉన్నాయట.
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నాయి. క్లైమాక్స్ లో మహేష్ ఆర్థిక వ్యవస్థపై వేసే సెటైర్లు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. భారీ యాక్షన్ సీన్ తో పాటు మహేష్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయట. దాదాపు ఐదు నిమిషాల పాటు సుదీర్ఘమైన స్పీచ్ ఇస్తాడని.. ఇందులో రాజకీయ, ఆర్థిక రంగాలపై సెటైర్లు ఉంటాయని సమాచారం.
లక్షల కోట్లు అప్పు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా నుంచి.. అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే రైతుల వరకు ప్రతీ ఒక్కరినీ ప్రస్తావిస్తూ ఈ డైలాగ్స్ సాగుతాయని.. ఈ సన్నివేశాలే సినిమాకి మెయిన్ సోల్ అని తెలుస్తోంది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటినుండే హైప్ ఓ రేంజ్ లో వస్తోంది. రీసెంట్ గా విడుదలైన సినిమా టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…