బాలీవుడ్లో ఒక మామూలు గ్లామర్ డాల్ హీరోయిన్ లాగా ఉన్న టైంలో దక్షిణాదిన కూడా రెండు సినిమాలు చేసింది కంగనా రనౌత్. తమిళంలో ధామ్ ధూమ్ అనే చిత్రంలో జయం రవితో జోడీ కట్టిన ఆమె.. తెలుగులో ప్రభాస్కు జోడీగా ఏక్ నిరంజన్లో నటించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ చిత్రం కంగనా పాత్ర ఏమంత గొప్పగా ఉండదు. గ్లామర్ పరంగా మాత్రం కంగనా ఆకట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో కంగనాకు మళ్లీ అవకాశాలు రాలేదు. ఈ లోపు బాలీవుడ్లో ఆమె రేంజే మారిపోయింది.
క్వీన్ సినిమాతో మంచి పెర్ఫామర్గా పేరు తెచ్చుకున్న ఆమె.. చూస్తుండగానే పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. కొన్నేళ్లుగా ఎక్కువగా హీరోయిన్ కొంచెం పెద్ద స్థాయిలో ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. ఇప్పుడు తలైవి సినిమాతో సౌత్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన కంగనాను.. ఇంతకీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడు అని అడిగారుమీడియా వాళ్లు. ఐతే ఇక్కడ సినిమాలు చేయొద్దని తనకేమీ లేదని.. తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన పూరీ జగన్నాథ్ను ఇంకో ఛాన్స్ కోసం తరచుగా అడుగుతూనే ఉంటానని కంగనా వెల్లడించింది. ప్రభాస్ సరసన ఇంకో సినిమా చేసే అవకాశం ఇప్పుడు ఇప్పించమని కూడా పూరీని అడుగుతుంటానని ఆమె అంది. పూరీ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నట్లు కూడా ఆమె చెప్పడం విశేషం.
తలైవిలో జయలలితగా కనిపించడం కోసం చాలా కష్టపడ్డానని.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని కంగనా ధీమా వ్యక్తం చేసింది. త్వరలో తాను ఇందిరాగాంధీ బయోపిక్లో కూడా నటించనున్నట్లు వెల్లడించింది. మోడీ ప్రభుత్వ హయాంలో తనకు రెండు జాతీయ పురస్కారాలు రావడంపై స్పందిస్తూ.. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా తనకు రెండు అవార్డులు వచ్చిన సంగతి ఎందుకు మరిచిపోతున్నారని కంగనా ప్రశ్నించింది.
This post was last modified on September 7, 2021 10:11 pm
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…