బాలీవుడ్లో ఒక మామూలు గ్లామర్ డాల్ హీరోయిన్ లాగా ఉన్న టైంలో దక్షిణాదిన కూడా రెండు సినిమాలు చేసింది కంగనా రనౌత్. తమిళంలో ధామ్ ధూమ్ అనే చిత్రంలో జయం రవితో జోడీ కట్టిన ఆమె.. తెలుగులో ప్రభాస్కు జోడీగా ఏక్ నిరంజన్లో నటించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ చిత్రం కంగనా పాత్ర ఏమంత గొప్పగా ఉండదు. గ్లామర్ పరంగా మాత్రం కంగనా ఆకట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో కంగనాకు మళ్లీ అవకాశాలు రాలేదు. ఈ లోపు బాలీవుడ్లో ఆమె రేంజే మారిపోయింది.
క్వీన్ సినిమాతో మంచి పెర్ఫామర్గా పేరు తెచ్చుకున్న ఆమె.. చూస్తుండగానే పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. కొన్నేళ్లుగా ఎక్కువగా హీరోయిన్ కొంచెం పెద్ద స్థాయిలో ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. ఇప్పుడు తలైవి సినిమాతో సౌత్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన కంగనాను.. ఇంతకీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడు అని అడిగారుమీడియా వాళ్లు. ఐతే ఇక్కడ సినిమాలు చేయొద్దని తనకేమీ లేదని.. తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన పూరీ జగన్నాథ్ను ఇంకో ఛాన్స్ కోసం తరచుగా అడుగుతూనే ఉంటానని కంగనా వెల్లడించింది. ప్రభాస్ సరసన ఇంకో సినిమా చేసే అవకాశం ఇప్పుడు ఇప్పించమని కూడా పూరీని అడుగుతుంటానని ఆమె అంది. పూరీ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నట్లు కూడా ఆమె చెప్పడం విశేషం.
తలైవిలో జయలలితగా కనిపించడం కోసం చాలా కష్టపడ్డానని.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని కంగనా ధీమా వ్యక్తం చేసింది. త్వరలో తాను ఇందిరాగాంధీ బయోపిక్లో కూడా నటించనున్నట్లు వెల్లడించింది. మోడీ ప్రభుత్వ హయాంలో తనకు రెండు జాతీయ పురస్కారాలు రావడంపై స్పందిస్తూ.. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా తనకు రెండు అవార్డులు వచ్చిన సంగతి ఎందుకు మరిచిపోతున్నారని కంగనా ప్రశ్నించింది.
This post was last modified on September 7, 2021 10:11 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…