బాలీవుడ్లో ఒక మామూలు గ్లామర్ డాల్ హీరోయిన్ లాగా ఉన్న టైంలో దక్షిణాదిన కూడా రెండు సినిమాలు చేసింది కంగనా రనౌత్. తమిళంలో ధామ్ ధూమ్ అనే చిత్రంలో జయం రవితో జోడీ కట్టిన ఆమె.. తెలుగులో ప్రభాస్కు జోడీగా ఏక్ నిరంజన్లో నటించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ చిత్రం కంగనా పాత్ర ఏమంత గొప్పగా ఉండదు. గ్లామర్ పరంగా మాత్రం కంగనా ఆకట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో కంగనాకు మళ్లీ అవకాశాలు రాలేదు. ఈ లోపు బాలీవుడ్లో ఆమె రేంజే మారిపోయింది.
క్వీన్ సినిమాతో మంచి పెర్ఫామర్గా పేరు తెచ్చుకున్న ఆమె.. చూస్తుండగానే పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. కొన్నేళ్లుగా ఎక్కువగా హీరోయిన్ కొంచెం పెద్ద స్థాయిలో ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. ఇప్పుడు తలైవి సినిమాతో సౌత్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన కంగనాను.. ఇంతకీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడు అని అడిగారుమీడియా వాళ్లు. ఐతే ఇక్కడ సినిమాలు చేయొద్దని తనకేమీ లేదని.. తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన పూరీ జగన్నాథ్ను ఇంకో ఛాన్స్ కోసం తరచుగా అడుగుతూనే ఉంటానని కంగనా వెల్లడించింది. ప్రభాస్ సరసన ఇంకో సినిమా చేసే అవకాశం ఇప్పుడు ఇప్పించమని కూడా పూరీని అడుగుతుంటానని ఆమె అంది. పూరీ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నట్లు కూడా ఆమె చెప్పడం విశేషం.
తలైవిలో జయలలితగా కనిపించడం కోసం చాలా కష్టపడ్డానని.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని కంగనా ధీమా వ్యక్తం చేసింది. త్వరలో తాను ఇందిరాగాంధీ బయోపిక్లో కూడా నటించనున్నట్లు వెల్లడించింది. మోడీ ప్రభుత్వ హయాంలో తనకు రెండు జాతీయ పురస్కారాలు రావడంపై స్పందిస్తూ.. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా తనకు రెండు అవార్డులు వచ్చిన సంగతి ఎందుకు మరిచిపోతున్నారని కంగనా ప్రశ్నించింది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…