బాలీవుడ్లో ఒక మామూలు గ్లామర్ డాల్ హీరోయిన్ లాగా ఉన్న టైంలో దక్షిణాదిన కూడా రెండు సినిమాలు చేసింది కంగనా రనౌత్. తమిళంలో ధామ్ ధూమ్ అనే చిత్రంలో జయం రవితో జోడీ కట్టిన ఆమె.. తెలుగులో ప్రభాస్కు జోడీగా ఏక్ నిరంజన్లో నటించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ చిత్రం కంగనా పాత్ర ఏమంత గొప్పగా ఉండదు. గ్లామర్ పరంగా మాత్రం కంగనా ఆకట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో కంగనాకు మళ్లీ అవకాశాలు రాలేదు. ఈ లోపు బాలీవుడ్లో ఆమె రేంజే మారిపోయింది.
క్వీన్ సినిమాతో మంచి పెర్ఫామర్గా పేరు తెచ్చుకున్న ఆమె.. చూస్తుండగానే పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. కొన్నేళ్లుగా ఎక్కువగా హీరోయిన్ కొంచెం పెద్ద స్థాయిలో ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. ఇప్పుడు తలైవి సినిమాతో సౌత్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన కంగనాను.. ఇంతకీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడు అని అడిగారుమీడియా వాళ్లు. ఐతే ఇక్కడ సినిమాలు చేయొద్దని తనకేమీ లేదని.. తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన పూరీ జగన్నాథ్ను ఇంకో ఛాన్స్ కోసం తరచుగా అడుగుతూనే ఉంటానని కంగనా వెల్లడించింది. ప్రభాస్ సరసన ఇంకో సినిమా చేసే అవకాశం ఇప్పుడు ఇప్పించమని కూడా పూరీని అడుగుతుంటానని ఆమె అంది. పూరీ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నట్లు కూడా ఆమె చెప్పడం విశేషం.
తలైవిలో జయలలితగా కనిపించడం కోసం చాలా కష్టపడ్డానని.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని కంగనా ధీమా వ్యక్తం చేసింది. త్వరలో తాను ఇందిరాగాంధీ బయోపిక్లో కూడా నటించనున్నట్లు వెల్లడించింది. మోడీ ప్రభుత్వ హయాంలో తనకు రెండు జాతీయ పురస్కారాలు రావడంపై స్పందిస్తూ.. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా తనకు రెండు అవార్డులు వచ్చిన సంగతి ఎందుకు మరిచిపోతున్నారని కంగనా ప్రశ్నించింది.
This post was last modified on September 7, 2021 10:11 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…