బాలీవుడ్లో ఒక మామూలు గ్లామర్ డాల్ హీరోయిన్ లాగా ఉన్న టైంలో దక్షిణాదిన కూడా రెండు సినిమాలు చేసింది కంగనా రనౌత్. తమిళంలో ధామ్ ధూమ్ అనే చిత్రంలో జయం రవితో జోడీ కట్టిన ఆమె.. తెలుగులో ప్రభాస్కు జోడీగా ఏక్ నిరంజన్లో నటించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ చిత్రం కంగనా పాత్ర ఏమంత గొప్పగా ఉండదు. గ్లామర్ పరంగా మాత్రం కంగనా ఆకట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో కంగనాకు మళ్లీ అవకాశాలు రాలేదు. ఈ లోపు బాలీవుడ్లో ఆమె రేంజే మారిపోయింది.
క్వీన్ సినిమాతో మంచి పెర్ఫామర్గా పేరు తెచ్చుకున్న ఆమె.. చూస్తుండగానే పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. కొన్నేళ్లుగా ఎక్కువగా హీరోయిన్ కొంచెం పెద్ద స్థాయిలో ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. ఇప్పుడు తలైవి సినిమాతో సౌత్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన కంగనాను.. ఇంతకీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడు అని అడిగారుమీడియా వాళ్లు. ఐతే ఇక్కడ సినిమాలు చేయొద్దని తనకేమీ లేదని.. తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన పూరీ జగన్నాథ్ను ఇంకో ఛాన్స్ కోసం తరచుగా అడుగుతూనే ఉంటానని కంగనా వెల్లడించింది. ప్రభాస్ సరసన ఇంకో సినిమా చేసే అవకాశం ఇప్పుడు ఇప్పించమని కూడా పూరీని అడుగుతుంటానని ఆమె అంది. పూరీ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నట్లు కూడా ఆమె చెప్పడం విశేషం.
తలైవిలో జయలలితగా కనిపించడం కోసం చాలా కష్టపడ్డానని.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని కంగనా ధీమా వ్యక్తం చేసింది. త్వరలో తాను ఇందిరాగాంధీ బయోపిక్లో కూడా నటించనున్నట్లు వెల్లడించింది. మోడీ ప్రభుత్వ హయాంలో తనకు రెండు జాతీయ పురస్కారాలు రావడంపై స్పందిస్తూ.. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా తనకు రెండు అవార్డులు వచ్చిన సంగతి ఎందుకు మరిచిపోతున్నారని కంగనా ప్రశ్నించింది.
This post was last modified on September 7, 2021 10:11 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…