స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. సెకండ్ పార్ట్ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది.
ఇప్పుడు ‘ఐకాన్’ను పూర్తి చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బన్నీతో రెండు సినిమాల్లో కలిసి పని చేసిన పూజాహెగ్డే ఇప్పుడు మూడోసారి అతడితో జతకట్టబోతుంది. ఇదిలా ఉండగా.. కథ ప్రకారం సినిమాలో మరో హీరోయిన్ కి కూడా ప్రాధాన్యత ఉంది. ఆ పాత్ర కోసం యంగ్ బ్యూటీ కృతిశెట్టిని తీసుకోవాలనుకుంటున్నారు.
‘ఉప్పెన’ సినిమాతో కుర్రకారుని ఆకట్టుకున్న కృతికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. నాని, రామ్ లాంటి పేరున్న హీరోలతో కలిసి నటిస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వస్తే ఇక టాప్ లీగ్ లోకి చేరిపోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం నార్త్ లో జరగనుంది.
This post was last modified on September 6, 2021 2:38 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…