కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ స్టార్ త్వరలోనే హాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నారు. అంతేకాదు.. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉండగా.. మరికొంతమంది టాలీవుడ్ దర్శకులు ధనుష్ తో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
వెంకీ అట్లూరి లాంటి యంగ్ డైరెక్టర్ ధనుష్ కి కథ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ధనుష్ స్వయంగా ఓ తెలుగు డైరెక్టర్ ని కథ చెప్పమని అడగడం విశేషం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తనదైన ముద్ర వేసిన అజయ్ భూపతి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ‘మహాసముద్రం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా పోస్టర్లు, పాటలు ధనుష్ ని ఆకట్టుకోవడంతో అజయ్ భూపతిని కలవాలనుకున్నారు. షూటింగ్ కోసం గోవా వెళ్లిన ధనుష్ అక్కడకి అజయ్ భూపతిని పిలిపించి కథ ఏమైనా ఉంటే చెప్పమని అడిగారట. దీంతో అజయ్ భూపతి.. ధనుష్ కి తగ్గ కథ సిద్ధం చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆ కథ గనుక ధనుష్ కి నచ్చితే వీరి కాంబినేషన్ లో సినిమా రావడం పక్కా. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on September 6, 2021 1:30 pm
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…