పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దయా గుణం గురించి చెప్పడానికి చాలా ఉంది. నటుడిగా తొలి అడుగులు వేస్తున్న సమయం నుంచి అతడి సేవా భావం గురించి అందరికీ తెలిసిందే. కార్గిల్ యుద్ధ సమయంలో వీర సైనికుల కోసం విరాళం ఇవ్వడం దగ్గర్నుంచి.. గత రెండు దశాబ్దాల్లో పవన్ తన సేవా భావాన్ని చాటుకున్న ఉదంతాలు ఎన్నో. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఎన్నోసార్లు వివిధ సేవా కార్యక్రమాల కోసం విరాళాలు అందజేసిన పవన్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాక మరింతగా తన ఉదారతను చాటుకున్నాడు.
ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు స్పందించడమే కాక.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, తనను సంప్రదించినా వెంటనే సాయం అందజేయడం చాలాసార్లు చూశారు. ఇప్పుడు ఓ పేద కళాకారుడిని ఆదుకోవడానికి పవన్ ముందుకొచ్చాడు. ఆ కళాకారుడే.. దర్శనం మొగిలయ్య. తాను ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ కోసం తన గొంతును అరువిచ్చిన మొగిలయ్యకు పవన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందింది.
జానపద కళాకారుడైన మొగిలయ్య గురించి మొన్నటిదాకా జనాలకు పెద్దగా తెలియదు. అంతర్ధానం అయిపోతున్న 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ ప్రాచీన కళను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అరుదైన కళాకారుడు మొగిలయ్య. కొన్ని నెలల ముందు వరకు బస్టాండ్లలో పాటలు పాడుతూ డబ్బులు యాచించడం ద్వారా అతి కష్టం మీద జీవనం సాగిస్తూ వచ్చాడు మొగిలయ్య. ఆయన గురించి ఓ పత్రికలో వార్త రావడంతో ప్రభుత్వం స్పందించి కొంత సాయం అందించింది.
జానపదాల మీద పవన్ ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తాడన్న సంగతి తెలిసిందే. ఆయన గత సినిమాలు చాలా వాటిలో జానపదాలు చూడొచ్చు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ను కూడా ఫోక్ స్టయిల్లో చేశారు. ఈ పాటలో ఆరంభ గానం మొగిలయ్యతోనే చేయించారు. ఈ సందర్భంగా మొగిలయ్య గురించి తెలుసుకుని పవన్.. తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ ద్వారా ఆయనకు రూ.2 లక్షల సాయాన్ని అందజేశారు.
This post was last modified on September 6, 2021 10:33 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…