కంగనా రనౌత్ ఎంత గొప్ప నటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లలో క్వీన్, మణికర్ణిక సహా కొన్ని చిత్రాల్లో అసాధారణమైన నటన కనబరిచి కోట్లమందికి ఫేవరెట్ హీరోయిన్ అయిందామె. వ్యక్తిగతంగా డేరింగ్ అండ్ డాషింగ్ ఇమేజ్ ఉన్న కంగనా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఐరన్ లేడీగా పేరున్న జయలలిత పాత్రలో నటించనుందన్న వార్త బయటికి రాగానే అందరూ ఎగ్జైట్ అయ్యారు.
లుక్స్ విషయంలో జయలలితను కంగనా మ్యాచ్ చేయగలదా అన్న సందేహాలు కలిగాయి కానీ.. కంగనా కష్టానికి మేకప్ నైపుణ్యం కూడా తోడవడంతో ఈ విషయంలో పెద్ద ఇబ్బంది లేకపోయింది. ప్రోమోల్లో కంగనా స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు చాలా బాగా అనిపించి తలైవి మీద అంచనాలు పెరిగాయి. ఐతే నిజానికి ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం ముందు అనుకున్నది కంగనా రనౌత్ పేరు కాదట.
ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాదే ఆమె పేరును సూచించాడట. తలైవి ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాకు స్క్రిప్టు రాయమన్నపుడు చాలా సంతోషంగా ఒప్పుకున్నానని.. కానీ అప్పటికి మేకర్స్ వేరే హీరోయిన్ని జయలలిత పాత్రకు అనుకున్నారని.. కానీ తాను కంగనా పేరును సూచించానని విజయేంద్ర తెలిపారు. కానీ ఈ సినిమాలో నటించమని కంగనాను అప్రోచ్ అయ్యేదెవరు.. ఆమెకు కథ నచ్చకపోతే మనల్ని బతకనివ్వదే అన్న భయం కలిగిందని ఆయనన్నారు.
ఐతే అదృష్టవశాత్తూ కంగనాకు కథ నచ్చిందని.. జయలలిత పాత్రలో ఆమె అద్భుతంగా నటించిందని.. ఈ సినిమా తర్వాత కంగనా టాప్ చైర్లో ఉంటుందని ముందే చెప్పానని విజయేంద్ర పేర్కొన్నారు.
This post was last modified on September 6, 2021 10:24 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…