వాయిదాల మీద వాయిదాలు ఎన్నో నెలల నుంచి విడుదల కోసం చూస్తున్న భారీ చిత్రం ‘తలైవి’ ఇంకో ఐదు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం చేశారు.
వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్ర హిందీ వెర్షన్ థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేయబోతుండటం పట్ల పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సినిమాను తమ థియేటర్లలో ప్రదర్శించబోమని ప్రకటించడం తెలిసిందే.
దీనిపై కంగనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీవీఆర్, ఐనాక్స్లను తీరును తప్పుబట్టింది. థియేటర్లకు ప్రేక్షకులు రాక కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికే నిర్మాతలు సంకోచిస్తున్న సమయంలో ఇలా ఆంక్షలు పెట్టడమేంటని విమర్శించింది.
ఐతే కంగనా ఎటాక్ నేపథ్యంలో పీవీఆర్ స్పందించింది. ‘తలైవి’పై పెట్టిన ఆంక్షల విషయంలో సడలింపులు ఇచ్చింది. తెలుగు, తమిళ వెర్షన్లను ఓటీటీలో నెల రోజుల వ్యవధి తర్వాత విడుదల చేయనున్న నేపథ్యంలో వాటిని మాత్రం పీవీఆర్ థియేటర్లలో ప్రదర్శిస్తామని చెప్పింది. హిందీ వెర్షన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.
గతంలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎనిమిది వారాలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని తాము షరతు పెట్టామని.. ఆపై మారిన పరిస్థితుల దృష్ట్యా నాలుగు వారాల గ్యాప్కు అంగీకరించామని.. కానీ ‘తలైవి’ హిందీ వెర్షన్కు ఈ గ్యాప్ మరీ రెండు వారాలకు తగ్గించడం తమకు ఆమోదయోగ్యం కాదని.. అందుకే ఆ చిత్రాన్ని హిందీలో తాము దేశంలో ఎక్కడా ప్రదర్శించబోమని పీవీఆర్ స్పష్టం చేసింది.
కరోనా దెబ్బ కొట్టినా.. ఇంత కాలం ఆగి థియేటర్లలోనే ‘తలైవి’ని రిలీజ్ చేయాలనుకోవడం అభినందనీయమే అని.. కానీ మంచి అంచనాలున్న ఈ చిత్రాన్ని రెండు వారాలకే హిందీలో ఓటీటీలో రిలీజ్ చేయడం మాత్రం సమంజసం కాదని పీవీఆర్ పేర్కొంది.
This post was last modified on September 5, 2021 3:25 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…