దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తూనే ఉంది. తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. సినీ నటుడు, రియల్ హీరో ఈ థర్డ్ వేవ్ పై చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
దేశంలో నిరుద్యోగ సమస్య, పేదరికంతో ఇప్పటికే థర్డ్వేవ్ ను అనుభవిస్తున్నామని అన్నారు సోనూసూద్. భారత్ లో థర్డ్ వేవ్ వస్తుందా అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా మాట్లాడారు.
తనను ఒకరు దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా అని అడిగారని.. నిరుద్యోగం థర్డ్ వేవ్ లాంటిదేనని తాను చెప్పానని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. నిరుద్యోగం కరోనా థర్డ్వేవ్ కంటే తక్కువేమి కాదన్నారు సోనూ. పేదలకు సాయం, ఉపాధి కల్పించడమే దీనికి అసలైన మందు అని ట్వీట్ చేశారు. సోనూ ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఉందని కొందరు అంటుంటే.. డబ్బున్న వాళ్లు సాయం చేయడానికి ముందుకొచ్చేలా ఉందని మరికొందరు అంటున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…