దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తూనే ఉంది. తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. సినీ నటుడు, రియల్ హీరో ఈ థర్డ్ వేవ్ పై చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
దేశంలో నిరుద్యోగ సమస్య, పేదరికంతో ఇప్పటికే థర్డ్వేవ్ ను అనుభవిస్తున్నామని అన్నారు సోనూసూద్. భారత్ లో థర్డ్ వేవ్ వస్తుందా అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా మాట్లాడారు.
తనను ఒకరు దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా అని అడిగారని.. నిరుద్యోగం థర్డ్ వేవ్ లాంటిదేనని తాను చెప్పానని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. నిరుద్యోగం కరోనా థర్డ్వేవ్ కంటే తక్కువేమి కాదన్నారు సోనూ. పేదలకు సాయం, ఉపాధి కల్పించడమే దీనికి అసలైన మందు అని ట్వీట్ చేశారు. సోనూ ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఉందని కొందరు అంటుంటే.. డబ్బున్న వాళ్లు సాయం చేయడానికి ముందుకొచ్చేలా ఉందని మరికొందరు అంటున్నారు.
This post was last modified on September 4, 2021 11:41 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…