దర్శకులు అప్పుడప్పుడూ లిరిసిస్టులుగా మారడం మామూలే. స్వతహాగా రచనా నేపథ్యం నుంచి వచ్చిన వారికి పాట రాయడం పెద్ద కష్టమేమీ కాదు. ఐతే పాట రాయడం వరకు ఓకే కానీ.. ఆ పాటను దర్శకుడే ఆలపించడం మాత్రం అరుదైన విషయమే. యువ దర్శకుడు శివ నిర్వాణ ఆ అరుదైన పనే చేశాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం టక్ జగదీష్ కోసం ఒక పాట రాసి.. దాన్ని స్వయంగా ఆలపించాడు. టక్ జగదీష్లో హీరో పాత్రకు ఎలివేషన్ ఇచ్చే టక్ సాంగ్ ఇది కావడం విశేషం.
సల్లాటి కుండలో సల్లసుక్క మనసువాడు.. నువ్వు గిల్లి గిచ్చి రెచ్చగొడితే వచ్చి దంచుతాడు.. అంటూ అల వైకుంఠపురములో క్లైమాక్స్లో వచ్చే సిత్తరాల సిరపడు తరహా జానపద గేయం ఇది. ఈ పాటను ఒక ఆసక్తికర వీడియో ద్వారా లాంచ్ చేశారు.
ముందు సంగీత దర్శకుడు గోపీ సుందర్ ట్యూన్ వినిపించడం.. అది భలేగా ఉందని శివ దానికి సాహిత్యం సమకూర్చడం.. ఈ పాటను నాని పాడితే బాగుంటుందని శివ అనడం.. తర్వాత ఇద్దరూ కలిసి నాని దగ్గరికెళ్లడం.. అదనేమో అయిష్టత వ్యక్తం చేస్తూ ఈ పాటను శివనే ఆలపిస్తే బాగుంటుందనడం.. చివరికి శివనే ఈ పాటను ఆలపించడం.. ఇలా సాగింది ఈ వీడియో.
ఐతే సాహిత్యం వరకు ఓకే కానీ.. శివ ఈ పాట ఆలపించిన తీరైతే ఏమంత బాగా లేదు. ప్రొఫెషనల్ సింగర్ను పెడితే ఈ పాటకు ప్రత్యేకత చేకూరేది అనిపించింది. మరి సినిమాలో శివ వాయిస్ ఓకే అనిపిస్తుందేమో చూడాలి. ఇది బిట్ సాంగే కాబట్టి మరీ ఇబ్బంది లేకపోవచ్చు. ఈ చిత్రానికి తమనే సంగీత దర్శకుడు అయినప్పటికి.. ఈ మధ్య మరీ బిజీ అయిపోవడంతో నేపథ్య సంగీతంతో పాటు ఈ పాట వరకు గోపీసుందర్ బాధ్యత తీసుకున్నాడు.
This post was last modified on September 4, 2021 11:25 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…