టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రూటే వేరు. ఆమె నటన, మాట, చేసే పనులు అన్నీ భిన్నంగా ఉంటాయి. కేవలం తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ భారీగా అభిమానుల్ని సంపాదించుకోవడం సమంత ప్రత్యేకత. ఆమె అప్పుడప్పుడూ నెటిజన్లతో చేసే చిట్చాట్లు కూడా ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. అవి ఆమె ప్రత్యేకతను చాటి చెబుతుంటాయి.
తాజాగా సమంత మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక నెటిజన్.. మిమ్మల్ని ద్వేషించే వారిపై (హేటర్స్) మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే.. వాళ్లకు తాను రుణపడి ఉంటానని చెప్పింది సామ్.
పొగడ్తలు వింటే తాను చాలా బద్ధకంగా తయారవుతుంటానని.. అలా కాకుండా తనను విమర్శిస్తూ ఉంటే కష్టపడి పని చేసి మంచి ఔట్ పుట్ ఇస్తానని.. కాబట్టి తాను మెరుగవడానికి కారణమవుతున్న హేటర్స్కు తాను థ్యాంక్స్ చెబుతానని అంది సామ్.
ఇక క్వారంటైన్ టైంలో మీరు నేర్చుకున్న విలువైన పాఠం ఏంటి అని అడిగితే.. మనం పెద్ద పెద్ద కలల వెనుక పరుగులు పెట్టాల్సిన పని లేదు, ఇంట్లో కుటుంబంతో కలిసి ఖాళీగా ఉండటమే ఒక కల అని తెలుసుకున్నట్లు సమంత చెప్పింది. నాగచైతన్య, అఖిల్ల గురించి ఏమంటారు అనడిగితే.. ‘బెస్ట్ జీన్స్’ అని బదులిచ్చింది సామ్.
అత్యంత ఇష్టమైన సినిమా గురించి అడిగితే.. చిన్నప్పట్నుంచి తనకు ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ చాలా నచ్చిన సినిమా అని చెప్పింది. అభిమానుల గురించి చెప్పమంటే.. వాళ్లు బలమే కాదు బలహీనత కూడా అని సమంత అంది.
లాక్ డౌన్ టైంలో ఫిట్గా ఎలా ఉంటున్నారు అడిగితే.. నిజానికి తాను స్పైసీ ఫుడ్ బాగా ఇష్టపడతానని, తరచుగా బిరియానీ తింటానని, ఈ మధ్యే మూడు ఆవకాయ బాటిళ్లు ఖాళీ చేశానని.. వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉంటూ, వ్యామామాలు చేస్తూ ఫిట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నానని సమంత అంది.
This post was last modified on May 29, 2020 1:58 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…