టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రూటే వేరు. ఆమె నటన, మాట, చేసే పనులు అన్నీ భిన్నంగా ఉంటాయి. కేవలం తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ భారీగా అభిమానుల్ని సంపాదించుకోవడం సమంత ప్రత్యేకత. ఆమె అప్పుడప్పుడూ నెటిజన్లతో చేసే చిట్చాట్లు కూడా ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. అవి ఆమె ప్రత్యేకతను చాటి చెబుతుంటాయి.
తాజాగా సమంత మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక నెటిజన్.. మిమ్మల్ని ద్వేషించే వారిపై (హేటర్స్) మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే.. వాళ్లకు తాను రుణపడి ఉంటానని చెప్పింది సామ్.
పొగడ్తలు వింటే తాను చాలా బద్ధకంగా తయారవుతుంటానని.. అలా కాకుండా తనను విమర్శిస్తూ ఉంటే కష్టపడి పని చేసి మంచి ఔట్ పుట్ ఇస్తానని.. కాబట్టి తాను మెరుగవడానికి కారణమవుతున్న హేటర్స్కు తాను థ్యాంక్స్ చెబుతానని అంది సామ్.
ఇక క్వారంటైన్ టైంలో మీరు నేర్చుకున్న విలువైన పాఠం ఏంటి అని అడిగితే.. మనం పెద్ద పెద్ద కలల వెనుక పరుగులు పెట్టాల్సిన పని లేదు, ఇంట్లో కుటుంబంతో కలిసి ఖాళీగా ఉండటమే ఒక కల అని తెలుసుకున్నట్లు సమంత చెప్పింది. నాగచైతన్య, అఖిల్ల గురించి ఏమంటారు అనడిగితే.. ‘బెస్ట్ జీన్స్’ అని బదులిచ్చింది సామ్.
అత్యంత ఇష్టమైన సినిమా గురించి అడిగితే.. చిన్నప్పట్నుంచి తనకు ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ చాలా నచ్చిన సినిమా అని చెప్పింది. అభిమానుల గురించి చెప్పమంటే.. వాళ్లు బలమే కాదు బలహీనత కూడా అని సమంత అంది.
లాక్ డౌన్ టైంలో ఫిట్గా ఎలా ఉంటున్నారు అడిగితే.. నిజానికి తాను స్పైసీ ఫుడ్ బాగా ఇష్టపడతానని, తరచుగా బిరియానీ తింటానని, ఈ మధ్యే మూడు ఆవకాయ బాటిళ్లు ఖాళీ చేశానని.. వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉంటూ, వ్యామామాలు చేస్తూ ఫిట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నానని సమంత అంది.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…