టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రూటే వేరు. ఆమె నటన, మాట, చేసే పనులు అన్నీ భిన్నంగా ఉంటాయి. కేవలం తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ భారీగా అభిమానుల్ని సంపాదించుకోవడం సమంత ప్రత్యేకత. ఆమె అప్పుడప్పుడూ నెటిజన్లతో చేసే చిట్చాట్లు కూడా ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. అవి ఆమె ప్రత్యేకతను చాటి చెబుతుంటాయి.
తాజాగా సమంత మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక నెటిజన్.. మిమ్మల్ని ద్వేషించే వారిపై (హేటర్స్) మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే.. వాళ్లకు తాను రుణపడి ఉంటానని చెప్పింది సామ్.
పొగడ్తలు వింటే తాను చాలా బద్ధకంగా తయారవుతుంటానని.. అలా కాకుండా తనను విమర్శిస్తూ ఉంటే కష్టపడి పని చేసి మంచి ఔట్ పుట్ ఇస్తానని.. కాబట్టి తాను మెరుగవడానికి కారణమవుతున్న హేటర్స్కు తాను థ్యాంక్స్ చెబుతానని అంది సామ్.
ఇక క్వారంటైన్ టైంలో మీరు నేర్చుకున్న విలువైన పాఠం ఏంటి అని అడిగితే.. మనం పెద్ద పెద్ద కలల వెనుక పరుగులు పెట్టాల్సిన పని లేదు, ఇంట్లో కుటుంబంతో కలిసి ఖాళీగా ఉండటమే ఒక కల అని తెలుసుకున్నట్లు సమంత చెప్పింది. నాగచైతన్య, అఖిల్ల గురించి ఏమంటారు అనడిగితే.. ‘బెస్ట్ జీన్స్’ అని బదులిచ్చింది సామ్.
అత్యంత ఇష్టమైన సినిమా గురించి అడిగితే.. చిన్నప్పట్నుంచి తనకు ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ చాలా నచ్చిన సినిమా అని చెప్పింది. అభిమానుల గురించి చెప్పమంటే.. వాళ్లు బలమే కాదు బలహీనత కూడా అని సమంత అంది.
లాక్ డౌన్ టైంలో ఫిట్గా ఎలా ఉంటున్నారు అడిగితే.. నిజానికి తాను స్పైసీ ఫుడ్ బాగా ఇష్టపడతానని, తరచుగా బిరియానీ తింటానని, ఈ మధ్యే మూడు ఆవకాయ బాటిళ్లు ఖాళీ చేశానని.. వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉంటూ, వ్యామామాలు చేస్తూ ఫిట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నానని సమంత అంది.
This post was last modified on May 29, 2020 1:58 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…