టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రూటే వేరు. ఆమె నటన, మాట, చేసే పనులు అన్నీ భిన్నంగా ఉంటాయి. కేవలం తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ భారీగా అభిమానుల్ని సంపాదించుకోవడం సమంత ప్రత్యేకత. ఆమె అప్పుడప్పుడూ నెటిజన్లతో చేసే చిట్చాట్లు కూడా ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. అవి ఆమె ప్రత్యేకతను చాటి చెబుతుంటాయి.
తాజాగా సమంత మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక నెటిజన్.. మిమ్మల్ని ద్వేషించే వారిపై (హేటర్స్) మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే.. వాళ్లకు తాను రుణపడి ఉంటానని చెప్పింది సామ్.
పొగడ్తలు వింటే తాను చాలా బద్ధకంగా తయారవుతుంటానని.. అలా కాకుండా తనను విమర్శిస్తూ ఉంటే కష్టపడి పని చేసి మంచి ఔట్ పుట్ ఇస్తానని.. కాబట్టి తాను మెరుగవడానికి కారణమవుతున్న హేటర్స్కు తాను థ్యాంక్స్ చెబుతానని అంది సామ్.
ఇక క్వారంటైన్ టైంలో మీరు నేర్చుకున్న విలువైన పాఠం ఏంటి అని అడిగితే.. మనం పెద్ద పెద్ద కలల వెనుక పరుగులు పెట్టాల్సిన పని లేదు, ఇంట్లో కుటుంబంతో కలిసి ఖాళీగా ఉండటమే ఒక కల అని తెలుసుకున్నట్లు సమంత చెప్పింది. నాగచైతన్య, అఖిల్ల గురించి ఏమంటారు అనడిగితే.. ‘బెస్ట్ జీన్స్’ అని బదులిచ్చింది సామ్.
అత్యంత ఇష్టమైన సినిమా గురించి అడిగితే.. చిన్నప్పట్నుంచి తనకు ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ చాలా నచ్చిన సినిమా అని చెప్పింది. అభిమానుల గురించి చెప్పమంటే.. వాళ్లు బలమే కాదు బలహీనత కూడా అని సమంత అంది.
లాక్ డౌన్ టైంలో ఫిట్గా ఎలా ఉంటున్నారు అడిగితే.. నిజానికి తాను స్పైసీ ఫుడ్ బాగా ఇష్టపడతానని, తరచుగా బిరియానీ తింటానని, ఈ మధ్యే మూడు ఆవకాయ బాటిళ్లు ఖాళీ చేశానని.. వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉంటూ, వ్యామామాలు చేస్తూ ఫిట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నానని సమంత అంది.
This post was last modified on May 29, 2020 1:58 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…